Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార చివరికి తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన కన్నా ముందుగా నయనతార హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ప్రభుదేవాతో ఈమె పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి చివరికి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక నయనతార మాయలో పడిన ప్రభుదేవా 15 సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ బంధాన్ని తెంచుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.
ఈ విధంగా నయనతార పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా తన భార్య రామ్లాత్(లత) కి విడాకులు కూడా ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి వివాహం ఆగిపోయింది. కానీ గతంలో ప్రభుదేవా భార్య లత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నయనతార తన భర్త ప్రభుదేవాతో ప్రేమించినట్టు నటించి నా కాపురంలో నిప్పులు పోసిందని తన ఆవేదన బయటపెట్టారు.
15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న మా జీవితంలోకి నయనతార వచ్చి మా బతుకులు రోడ్డున పడేసింది. అప్పటివరకు దేవతల చూస్తున్న నా భర్త తన కోసం విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి విడాకులు ఇచ్చారని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా నా జీవితాన్ని నాశనం చేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు. తను కనుక నాకు కనపడితే తనని కొడతానని గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడటంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరిక్షణంలో వీరు విడిపోవడంతో నయనతార తిరిగి దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.ఈ విధంగా నయనతార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సమయంలో ప్రభుదేవా భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…