Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార చివరికి తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన కన్నా ముందుగా నయనతార హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ప్రభుదేవాతో ఈమె పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి చివరికి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక నయనతార మాయలో పడిన ప్రభుదేవా 15 సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ బంధాన్ని తెంచుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.
ఈ విధంగా నయనతార పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా తన భార్య రామ్లాత్(లత) కి విడాకులు కూడా ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి వివాహం ఆగిపోయింది. కానీ గతంలో ప్రభుదేవా భార్య లత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నయనతార తన భర్త ప్రభుదేవాతో ప్రేమించినట్టు నటించి నా కాపురంలో నిప్పులు పోసిందని తన ఆవేదన బయటపెట్టారు.
15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న మా జీవితంలోకి నయనతార వచ్చి మా బతుకులు రోడ్డున పడేసింది. అప్పటివరకు దేవతల చూస్తున్న నా భర్త తన కోసం విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి విడాకులు ఇచ్చారని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా నా జీవితాన్ని నాశనం చేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు. తను కనుక నాకు కనపడితే తనని కొడతానని గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడటంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరిక్షణంలో వీరు విడిపోవడంతో నయనతార తిరిగి దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.ఈ విధంగా నయనతార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సమయంలో ప్రభుదేవా భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…