Featured

ఆ రైతుల నుంచి డబ్బులు వెనక్కు తీసుకుంటున్న మోదీ సర్కార్.. కారణమిదే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ గురించి మనందరికీ తెలుసు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. దేశంలోని అర్హులైన రైతులంతా ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్ కోసం రిజిష్టర్ చేసుకోవడంతో పాటు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. సంవత్సరానికి 6 వేల రూపాయలు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా రైతులకు జమ చేస్తోంది.

గత నెలలో కేంద్రం ఏడో విడత నగదును అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేసింది. రైతులకు ఆర్థిక సాయం అందించాలనే సదుద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ పై రైతుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అయితే మోదీ సర్కార్ కొంతమంది రైతుల ఖాతాల నుంచి ఇప్పటికే జమ చేసిన పీఎం కిసాన్ స్కీమ్ నగదును వెనక్కు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. కేంద్రం దేశంలోని కొంతమంది రైతులకు అర్హత లేకపోయినా ఈ స్కీమ్ నగదును జమ చేసింది.

దాదాపు 1,364 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ స్కీమ్ ద్వారా జమైనట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 20 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ మొత్తం జమైనట్లు వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లో ఎక్కువగా అర్హత లేని రైతుల ఖాతాలలో ఈ నగదు జమైంది. అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కొంతమంది రైతులు కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందినట్టు నివేదికల్లో వెల్లడైంది.

అనర్హుల ఖాతాల్లో జమైన నగదును అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్లు వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నాయి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లించినా, 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ పొందినా ఈ స్కీమ్ కు రైతులు అర్హత పొందరు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

1 hour ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

1 hour ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

1 hour ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

1 hour ago

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

1 hour ago

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

2 hours ago