కొందరు ఆవేశంతో చేస్తారో లేదా.. ఆలోచనతో చేస్తారో తెలియదు కానీ.. బారీ నష్టం జరిగి తర్వాత పశ్చాతాపపడుతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు.. పామూరు బస్టాండ్ సెంటర్లో ఓ బస్సుకు నిప్పు అంటించాడు. ఆ బస్సు కనిగిరి నుంచి పామూరు వెళ్తుంది. అందులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకొక్కరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు విచారించారు. ఎందుకు ఇలాంటి పని చేశావ్ అంటూ అని అడగ్గా.. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి.. త్వరలో జనసేన అధికారంలోకి వస్తుంది.. వాటి ధరలు తగ్గిస్తుందని అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
అంతేకాకుండా అతడు సీఎం జగన్ ను కూడా అసభ్య పదజాలంతో దూషించాడు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు అనుమానించి.. కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ పేర్కొన్నాడు. అక్కడ మంటల్లో చిక్కుకున్న వాళ్లకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…