Categories: FeaturedGeneral News

బస్సుకు నిప్పుపెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా?

కొందరు ఆవేశంతో చేస్తారో లేదా.. ఆలోచనతో చేస్తారో తెలియదు కానీ.. బారీ నష్టం జరిగి తర్వాత పశ్చాతాపపడుతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు.. పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఓ బస్సుకు నిప్పు అంటించాడు. ఆ బస్సు కనిగిరి నుంచి పామూరు వెళ్తుంది. అందులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకొక్కరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు విచారించారు. ఎందుకు ఇలాంటి పని చేశావ్ అంటూ అని అడగ్గా.. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి.. త్వరలో జనసేన అధికారంలోకి వస్తుంది.. వాటి ధరలు తగ్గిస్తుందని అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు.

అంతేకాకుండా అతడు సీఎం జగన్ ను కూడా అసభ్య పదజాలంతో దూషించాడు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు అనుమానించి.. కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ పేర్కొన్నాడు. అక్కడ మంటల్లో చిక్కుకున్న వాళ్లకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

17 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

17 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

17 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

18 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

19 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

19 hours ago