తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు ముగిసిన కూడా, అందుకు సంబంధించిన వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇందుకు సంబంధించి ఈ రోజు ఏదో ఒక వార్త తెరమీదకు వస్తూనే ఉంది. ఈ మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇక మా ఎన్నికల తరువాత ఈ వ్యవహారం చల్లబడుతుంది అనుకుంటే, ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ విషయం మరింత ముదిరేటట్లు కనిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్నికల వ్యవహారం మీద నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ఈ మా ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన రెండవ రోజు నుంచే రాజీనామాల పర్వం కూడా మొదలయింది. మొదట ప్రకాష్రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు ఆయనకు సపోర్ట్ చేసిన నాగబాబు అందరూ మా అసోసియేషన్ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
వాటిని మంచు విష్ణు ఆమోదించలేదు అని చెబుతున్నప్పటికీ ప్రకాష్ రాజు మాత్రం ఎన్నికల రోజు సీసీ టీవీ ఫుటేజ్ కావాలని కోరుతున్నారు. మా ఎన్నికల రోజున బయటి వ్యక్తులు వచ్చారని, మోహన్ బాబు బెదిరించాడని తనీష్, బెనర్జీ కూడా ఇదే విషయాన్ని కన్నీళ్ళు పెట్టుకొని సైతం మీడియా ముందు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రకాష్ మాత్రం సీసీ టీవీ పుటేజ్ ఇస్తే దానిని పరిశీలించి అవసరమైతే కోర్టుకు వెళ్తానని చెబుతున్నారు.మా ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు రౌడీషీటర్లు ఓటు వేయడానికి వచ్చి ఆర్టిస్టులను భయపెట్టారని ప్రకాష్ ఆరోపిస్తున్నారు.
అంతేకాకుండా ప్రకాష్ ఫిర్యాదులో కౌంటింగ్ హాల్లో నూకల సాంబశివరావు అని ఒక రౌడీషీటర్ ఉన్నాడని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సాంబశివరావు మీద రౌడీషీట్లు ఉన్నాయని చెబుతున్నారు. అతడిపై పలు కేసులు కూడా ఉన్నాయని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయం పట్ల ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. తాజాగా నూకల సాంబశివరావు ఫోటోలు కూడా తన ట్విట్టర్ ఖాతాలో కూర చేశారు. డియర్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణమోహన్ గారు ఇది బిగినింగ్ మాత్రమే, మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి ఇప్పుడు ప్రపంచానికి మా ఎలక్షన్లు ఏవిధంగా జరిగాయి అనేది మేము తెలియజేస్తాము అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసారు.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…