Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు ఎక్కడా పోరాటం ఆపలేదంటూ చెప్పారు. కానీ కూతురు చనిపోయి ఇరవై ఏళ్ళు దాటిపోయినా న్యాయం మాత్రం జరగలేదని బాధపడ్డారు.
నాలుగు, ఐదు గెస్ట్ హౌస్ లు మారుస్తూ అత్యాచారం చేశారు…
ప్రత్యూష, తమ ప్రియుడు సిద్ధార్థరెడ్డి తో కలిసి విషం తాగి మరణించాలని భావించారు. అయితే ప్రత్యూష మరణించింది సిద్ధార్థరెడ్డి బ్రతికాడు, ఇది బయటికి చెబుతున్న విషయంలో కానీ నిజానికి ప్రత్యూష మీద అత్యాచారం జరిగిందని వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక ఈ విషయంలో గురించి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మాట్లాడుతూ ఆఫ్ రికార్డు ఎంక్వయిరీ చేసినపుడు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో దాదాపు నాలుగు ఐదు గెస్ట్ హౌస్ లు మారుతూ సిద్ధార్థరెడ్డి అతని గ్యాంగ్ అత్యాచారం చేసారు.
చివరి గెస్ట్ హౌస్ కి వెళ్లేసరికి ప్రత్యూష ఆపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అందరూ కలిసి సిద్ధార్థను ముందుకు పెట్టి తప్పించుకున్నారు. సిద్ధార్థ రెడ్డి నోరువిప్పితే అందరూ బయటికి వస్తారు. అతను ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతనికి ఎవరెవరు అత్యాచారం చేసారని చెప్పాల్సిన అవసరం లేదు కదా, దేవుడే వారిని శిక్షిస్తాడు కన్న తల్లిగా నాది అరణ్య రోధన అంటూ చెప్పారు సరోజినీ దేవి.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…