Prathyusha Garimella : హైదరాబాద్ లో శనివారం రాత్రి ఫిల్మ్ నగర్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలోనే ప్రత్యూష గరిమెళ్ల అనే ఫ్యాషన డిజైనర్ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రత్యూష చాలా మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రెస్సులు డిజైన్ చేసింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ లోని బోతిక్ లోని బాత్రూం లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వాచ్ మెన్ వచ్చి డోర్ తట్టినా స్పందించకపోవడంతో వాచ్మెన్ పోలీసులకు ఫోన్ చేసారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. బాత్రూంలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ దొరికింది. మొదట అనుమానస్పద మృతిగా భావించినా ఆమె రాసిన సుసైడ్ నోట్ లభ్యం అవడంతో సుసైడ్ గా భావిస్తున్నారు.
మీకు భారం కాలేను….
తన ఒంటరి జీవితంతో విసిగిపోయానని, ఇది తాను ఆశించిన జీవితం కాదని ఆమె రాసింది. తన తల్లిదండ్రులపై భారం పడకూడదని మరియు ఇలాంటి ఒక పని చేస్తున్నందుకు చింతిస్తున్నానని సుసైడ్ నోట్ లో రాసింది. ఇక ప్రత్యూష మరణం చాలా మంది సినిమా సెలబ్రిటీలను దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రత్యూష బాలీవుడ్ లో మాధురి దీక్షిత్, దీపిక పడుకొనే, పర్నీత చోప్రా, విద్యాబాలన్, జక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్, జూహి చావ్లా, ఇక ఇటు టాలీవుడ్ లో శృతి హాసన్, ఛార్మి, ఉపాసన, రామ్ చరణ్, రానా వంటి కొంత మంది స్టార్స్ కి డిజైనర్ గా వ్యవహారించింది. ఇక ఉపాసన ప్రత్యూష మరణానికి చింతిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఉన్నతంగా ఆలోచించే నువ్వు……
ప్రత్యూష నా ప్రియమైన స్నేహితురాలు.. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రతి విషయంలోనూ ఆమె ఉన్నతంగా ఆలోచించేది. కెరీర్ గురించి, కుటుంబం, స్నేహితుల గురించి గొప్ప నిర్ణయాలే తీసుకునేది. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఆలోచించే ప్రత్యూష డిప్రెషన్కు గురి కావడం బాధ కలిగిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలి ట్విట్టర్ వేదికగా కోరుకుంది ఉపాసన. కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. ఒంటరితనం, డిప్రెషన్ కి లోనై ఇలాంటి పని చేయడం అందరిని కలచివేస్తుంది. ప్రత్యూష తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారని నెల కిందట కూడా వచ్చి వెళ్లారని ఇక్కడ పని చేసే వాచ్ మెన్ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…