Priya Anand : లీడర్ సినిమా ద్వారా తెలుగులో పరిచయమైన ప్రియా ఆనంద్, ఆ తరువాత రామ రామ కృష్ణ కృష్ణ, వంటి సినిమాల్లో నటించిన ప్రియా ఆనంద్ అమెరికాలో పెరిగిన అమ్మాయి. తమిళ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ప్రియ హిందీలోనూ ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి సినిమాల్లోను నటించింది. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సరసన నటించిన ఈ అమ్మడు తెలుగు, తమిళం హిందీ, కన్నడ, మలయాళం భాషలలో నటించింది.
నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలనుంది…
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు ప్రియా ఆనంద్. అయితే చాలా రోజుల తరువాత మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా రాబోతోంది. సుశాంత్ తో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముంధుకు రాబోతోంది. ప్రియా ఆనంద్, సుశాంత్ పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న ప్రియా తన పెళ్ళి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది. ఎన్నో వేల మంది భక్తులు ఉన్న నిత్యానంద స్వామిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
నిత్యానంద.. ఈ పేరు ఒకప్పుడు బాగా ఫేమస్, తనను తాను దేవుడు అని చెప్పుకుని తన మాటలతో ఎంతో మందిని తన భక్తులుగా చేసుకున్న నిత్యానంద ఆ తరువాత హీరోయిన్ రంజిత తో చేసిన రాసలీల వీడియో బయటికి రావడంతో, ఇక అమ్మాయిల అక్రమ నిర్భంధం వంటి కేసులతో దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఈక్వెడార్ దగ్గర్లో ఒక దీవిని కొని దానికి కైలాస దేశం అని పేరు పెట్టి సొంత కరెన్సీ కూడా పెట్టుకున్న నిత్యానంద అక్కడికి వెళితే నేరుగా కైలాసం చూపిస్తానని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వింత రోగంతో బాధపడుతూ నిత్యానంద బ్రతికున్నాడో, చనిపోయాడో ఎవరికీ తెలియదు. ఇక అలాంటి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ సరదాగా అని మళ్ళీ అందరూ మర్చిపోయిన నిత్యానందను గుర్తుచేసింది. ఇంతకీ నిత్యానందను ఎందుకు పెళ్లి చేసుకోవాలని ప్రియా అనుకుందంటే నిత్యానందను పెళ్లి చేసుకుంటే తన పేరు మార్చొకోవాల్సిన పని ఉండదు అంటూ ఫన్నీగా చెప్పింది ప్రియా.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…