Priyadarshini Ram : ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మొహం రెడ్డి రాజకీయ జీవితం తొలుతా కాంగ్రెస్ లోనే మొదలయింది. కాంగ్రెస్ నుండి పులివెందుల ఎంపీగా గెలిచిన ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ లో కొనసాగగా జగన్ మాత్రం తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి గల కారణాలను ఆయనకు సన్నిహితుడైన సాక్షి పేపర్ లవ్ డాక్టర్ ప్రియదర్శిని రామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సోనియా గాంధీ అన్న ఆ ఒక్క మాటే పార్టీ పెట్టడానికి కారణం…
రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన సమయంలో మొదట జగన్ ను సీఎం చేస్తారని అందరూ భావించినా అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయితే తండ్రి మరణించిన సమయంలో జగన్ ను కనీసం ఢిల్లీ పిలిచి సోనియా గాంధీ మాట్లాడలేదు అంటూ ప్రియదర్శిని రామ్ అభిప్రాయపడ్డారు. జగన్ కాంగ్రెస్ లో ఉంటూనే ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణ, ఏపీ లలో రాజశేఖర్ రెడ్డి మరణంతో చనిపోయిన పలువురికి కుటుంబాలను పరామర్శించాడు. అలా ఏపీ లో ఒక జిల్లా, తెలంగాణ లో ఒక జిల్లా అప్పటికే పరామర్శించిన ఆయనకు అనూహ్య స్పందన వచ్చిందని దీంతో సోనియా గాంధీ ఆయనను ఢిల్లీ కి రమ్మని పిలిచారని చెప్పారు రామ్.
అయితే ఢిల్లీ లో కుటుంబంతో వెళ్లగా సోనియా గాంధీ ఓదార్పు యాత్ర ఆపేయాలని, ఎవరైనా తన తండ్రి మరణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉంటే వారిని పిలిపించుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా చెప్పగా దుఃఖంలో ఉన్నవారిని నేను వెళ్లి ఓదార్చాలి కానీ నా దగ్గరకు పిలుచుకోవడం సంస్కారం కాదు కదా అని చెప్పారట. అయితే సోనియా గాంధీ అప్పటికే జగన్ ఓదార్పు యాత్ర చేయరాదు అని ఫిక్స్ అవడం వల్ల ఆయన మాటలకు ఒప్పుకోలేదట. దీంతో జగన్ బయటికి వచ్చేసారు. విజయమ్మ సోనియా కు నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదట. బయటికి వచ్చాక మా నాన్న బ్రతికిన పార్టీ ఆ పార్టీ కి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే ఉండి చేయలేను, అలా అని మా నాన్న కోసం ఆగిన గుండెలను పరామర్శించకుండా ఉండలేను అని పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రియదర్శిని రామ్ తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…