Producer Chittibabu : తాజాగా వచ్చిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్న రోజుల్లో కేంద్ర రాజకీయాల్లో వచ్చే మార్పులను సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పని ఇక అయిపోయింది అనుకుంటున్న తరుణంలో మరోసారి కర్ణాటకలో గెలిచి పార్టీ కి కొన ఊపిరి అందించింది. కర్ణాటక రాష్ట్ర బీజేపీ పాలకుల అవినీతి అలాగే రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభావం ఎన్నికల మీద చూపించిందని విశ్లేషకులు భావిస్తున్నా బీజేపీ లీడర్స్ మాత్రం ఇంకా ఓటమికి కారణాలను వెతుక్కుంటున్నారు. తాజాగా బీజేపీ కర్ణాటకలో అధికారం కోల్పోడానికి కారణాలను ఆ పార్టీ నేత సీనియర్ నిర్మాత చిట్టిబాబు వివరించారు.
బీజేపీ ఓటమికి కారణం అదే…
కాంగ్రెస్ పార్టీ ఒక్క కర్ణాటక లో గెలవగానే రాహుల్ ప్రధాని అయ్యాడన్నంతగా కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది, అవన్నీ జరిగేవి కాదు అంటూ చిట్టిబాబు మాట్లాడారు. కర్ణాటకలో అధికార మార్పిడి ప్రతి ఎన్నికలకు జరుగుతోంది, మరోసారి ఆ సెంటిమెంట్ నిజమైంది. అలాగే ప్రతి చోటా తక్కువ మెజారిటీ తేడాతోనే కాంగ్రెస్ గెలిచింది కానీ బీజేపీ ని ఎక్కడా చిత్తిగా ఓడించలేదు. కొన్ని దొంగ ఓట్లు కూడా వేసి ఉండవచ్చు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక బీజేపీ ఓడిపోయినా నష్టం లేదని కేంద్ర రాజకీయాల్లో ఆ ప్రభావం ఉండదంటూ చెప్పారు. మోడీ తో రాహుల్ గాంధీ పోటీ పడితే గెలుపు ఎవరిదో అందరికీ తెలిసిందే. ఇక ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకుని కాంగ్రెస్ పోయినా గెలుపు బీజేపీ కి వస్తుంది. అలా కాదని కాంగ్రెస్ ఓవైపు ప్రాంతీయ పార్టీల కూటమి ఒక వైపు బీజేపీ ఒక వైపు నిలిచినా బీజేపీకే లాభం చేకూరుతుంది అంటూ అంచనాలు వేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…