Liger cinema Executers : ఒక సినిమా నిర్మించాలంటే కేవలం నిర్మాత, హీరో, డైరెక్టర్ ఉంటే సరిపోదు. ఎంతో మంది సినిమా కార్మికులు అలాగే సినిమా నిర్మాణం కోసం హీరోని, దర్శకుడిని నమ్మి డబ్బు పెట్టే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ రన్ చేసేవాళ్ళు, ఫైనాన్సర్స్ ఇలా ఎంతో మంది ఒక వ్యవస్థలాగా పనిచేస్తారు. సినిమా హిట్ అయితే వీరందరూ బాగుపడుతారు. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరో, డైరెక్టర్, మిగిలిన ఆర్టిస్తులకు ఏమి కాదు వారి రెమ్యూనరేషన్స్ వాళ్లకు చేరి ఉంటాయి. కానీ అంతిమంగా నష్టపోయేది నిర్మాత మరీ ముఖ్యంగా సినిమాను బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్ ఓనర్స్. ప్రస్తుతం అలా నష్టపోయిన ఎగ్జిక్యూటర్స్ తమకు నష్ట పరిహారం ఇవ్వండి అంటూ రోడ్డున పడ్డారు.
లైగర్ కు జరిగిన నష్టం తీర్చండి…
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా లైగర్. హిందీ, తెలుగులో ఏక కాలంలో తీసిన ఈ సినిమా ఘోరంగా విఫలం అయింది. భారీగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిలిచ్చింది. అయితే ఈ సినిమా దర్శకత్వం వహించిన పూరీ, ఛార్మి ఇద్దరూ డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. డబ్బు కొంతైనా వెనక్కి ఇచ్చుంటే అలాగే నెక్స్ట్ సినిమా కూడా మీకు ఇస్తామని చెప్పుంటే డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్ యాజమాన్యం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసేవారు కాదు.
ఆచార్య సినిమా ఫ్లాప్ అయి నష్టాల్లో ఉన్నపుడు రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసాడు. అతన్ని చూసి విజయ్ దేవరకొండ నేర్చుకోవాలి అంటూ కొంతమంది ఎగ్జిక్యూటర్స్ అభిప్రాయపడ్డారు. విజయ్ నెక్స్ట్ సినిమాలు ఎలా థియేటర్స్ లో ఆడుతాయో చూస్తామంటున్నారు. మేము నష్టపోతే వాళ్ళు నష్టపోతారంటూ ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…