Producer Dhanunjaya reddy : మెగాస్టార్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా, ఒక రకంగా ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అంటే ‘ఖైదీ’ అని చెప్పొచ్చు. ఆ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో నిలిచిపోయింది. 24 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఖైదీ సినిమా దాదాపు 8 కోట్ల కలెక్షన్స్ తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మరో మలుపు తిరిగింది. ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ హీరో గా చిరంజీవి అవతరించారు. ఇక ఆ సినిమాను నిర్మించింది సంయుక్త ప్రొడక్షన్ వారు, దర్శకుడు కోదండ రామి రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అమెరికన్ సినిమా ‘ఫస్ట్ బ్లడ్’ ఇన్స్పిరేషన్ తో తీసిన సినిమా. ఇక ఈ సినిమా తెలుగులోనే కాక హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో కూడా తీశారు. ఈ సినిమాలో కన్నడ, హిందీ లో కూడా మాధవి నే హీరోయిన్ కావడం విశేషం.
చిరంజీవి, మాధవి మధ్య గొడవలు…
ఇక ఖైదీ సినిమా 1983 లో విడుదల చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని రగులుతోంది మొగలి పొద సాంగ్ మిగిలిన పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు చెందిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను సినిమా నిర్మాతలలో ఒకరైన ధనుంజయ రెడ్డి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సినిమా కోసం చిరంజీవి గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ అక్షరాలా 1 లక్ష 10 వేలంటూ చెప్పారు.
ఇక హీరోయిన్ మాధవి కి 50 వేలు ఇచ్చినట్లు చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి మాధవి మధ్య గొడవలు జరిగాయి అన్న విషయం మీద క్లారిటీ ఇచ్చారు ధనుంజయ రెడ్డిగారు. అభిప్రాయాబేధాలు అన్ని చోట్ల ఉంటాయని, చిన్న చిన్న అభిప్రాయాబేధాలే తప్ప గొడవలేమి జరగలేదని, ఇక నిర్మాతగా నాకు కొన్ని విషయాల్లో, కాస్ట్యూమ్స్ విషయంలో కొన్ని అభిప్రాయాబేధాలు వచ్చాయి కానీ గొడవలు జరిగేంత పెద్దగా ఏమి జరగలేదంటూ చెప్పారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…