Naga Vamsi: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం డిజే టిల్లు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పుట్టు మచ్చల గురించి పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం చోటుచేసుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వైజాగ్ లో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగవంశీ ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధించడం వల్ల అభిమానులు చాలా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం ఏ నిర్మాణ సంస్థకైనా ప్రేక్షకులే బలం. మీరు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజె టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను.
ప్రేక్షకులను సోదరులగా భావించడం వల్లే ఏక వచనంతో సంబోధించి మాట్లాడానని తెలిపారు.ఈ క్రమంలోనే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేసారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…