General News

Ahmedabad Serial Blast: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు… 38 మందికి మరణశిక్ష ఖరారు

Ahmedabad Serial Blast : 2008  సీరియల్ పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. దీనికి సంబంధించి ఈరోజు శిక్షలు ఖరారు చేసింది కోర్ట్.

Ahmedabad Serial Blast: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు… 38 మందికి మరణశిక్ష ఖరారు

2008 జులై 28న నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) వరస పేలుళ్లకు పాల్పడింది. సాధారణ ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడింది. మొత్తం 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా.. 200మంది తీవ్రంగా గాయపడ్డారు. జనావాసాలు, స్కైవేలు, బస్ స్టాండ్ వంటి ప్రాంతాల్లో బాంబులను అమర్చారు. 70 నిమిషాల వ్యవధిలో వరసగా పేలుళ్లు జరిగాయి. మరికొన్ని చోట్ల పేలుడు పదార్థాలను భద్రతా అధికారులు నిర్వీర్యం చేశారు. 

Ahmedabad Serial Blast: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు… 38 మందికి మరణశిక్ష ఖరారు

అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్ల కేసులో 49 మందిని నేరస్థులుగా ప్రత్యేక న్యాయభదస్థానం మంగళవారం ప్రకటించింది. 2008 జులై 26లో అహ్మదాబాద్ నగరంలో ఒకేసారి 70 నిమిషాల వ్యవధిలో వరుసగా జరిగిన 21 పేలుళ్లలో 56 మంది చనిపోగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ కేసులో మరో 28 మంది నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు జడ్జి ఎఆర్ పటేల్ విడిచిపెట్టారు. ఈ పేలుళ్లకు సంబంధించి మొత్తం వేర్వేరుగా దాఖలైన 35 కేసులను కలిపి ఒకటిగా విచారించారు.

గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా కుట్ర..!

ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అనే నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న 78 మందిపై 2009 డిసెంబర్‌లో విచారణ ప్రారంభమైంది. వీరిలో ఒకరు అప్రూవర్‌గా మారడంతో నిందితుల సంఖ్య 77 కు తగ్గింది. దీంతో అప్రూవర్ గా మారిన వ్యక్తి నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్… నిందితులకు వ్యతిరేఖంగా పక్కాగా సాక్ష్యాలను నమోదుచేసింది. విచారణ సందర్భంగా మొత్తం 1163 మంది సాక్షులను విచారించారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ సెంటర్ కూడా ఉంది. ఈ సంఘటనలో మైనార్టీ సమాజానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస పేలుళ్ల తరువాత సూరత్‌లో అనేక ప్రాంతాల నుంచి పోలీసులు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

17 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

24 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

37 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago