Naga Vamsi: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం డిజే టిల్లు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పుట్టు మచ్చల గురించి పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం చోటుచేసుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వైజాగ్ లో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగవంశీ ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధించడం వల్ల అభిమానులు చాలా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం ఏ నిర్మాణ సంస్థకైనా ప్రేక్షకులే బలం. మీరు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజె టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను.
ప్రేక్షకులను సోదరులగా భావించడం వల్లే ఏక వచనంతో సంబోధించి మాట్లాడానని తెలిపారు.ఈ క్రమంలోనే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేసారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…