Naga Vamsi: సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం డిజే టిల్లు. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నటి పుట్టు మచ్చల గురించి పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మరో వివాదం చోటుచేసుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వైజాగ్ లో ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత నాగవంశీ ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధించడం వల్ల అభిమానులు చాలా హర్ట్ అయినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన నాగ వంశీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బహిరంగంగా అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం ఏ నిర్మాణ సంస్థకైనా ప్రేక్షకులే బలం. మీరు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంలో డిజె టిల్లు విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను.
ప్రేక్షకులను సోదరులగా భావించడం వల్లే ఏక వచనంతో సంబోధించి మాట్లాడానని తెలిపారు.ఈ క్రమంలోనే నా మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేసారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…