సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను బడా నిర్మాతలు మంత్రి పేర్ని నానితో కలసి మాట్లాడారని.. ఆ విషయాలను పరిశ్రమకు స్పష్టంగా తెలపకపోవడం వల్లనే పవన్ కల్యాణ్, పోసాని మధ్య వివాదానికి కారణమయ్యాయని ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టికుమార్ తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ తో సినిమాలను తీస్తున్న కొందరు నిర్మాతలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ వల్లనే ‘పవన్ కళ్యాణ్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్’లో అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.
శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో అతడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడొచ్చు కానీ.. పెద్ద స్టార్ అయిన పవన్ సినీరంగం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవిక విషయాలు తెలుసుకుని మాట్లాడితే బావుండేదన్నారు. ఇదిలా ఉండగా.. అతడు మాట్లాడిన మాటలు బయట రచ్చ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న మంత్రి వద్దకు పవన్ తో సినిమా తీస్తున్న ఆ వ్యక్తులు వెళ్లి క్షమాపణలు అడిగారట.. వారిని పవన్ పంపించినట్లు బయట వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని పవన్ ఎలా తీసుకుంటారు. ఆ నిర్మాతల డబుల్ గేమ్ ను సమర్థిస్తారా? లేదా? అన్నది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం.
పోసాని ఇంటిపై దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పు అని.. క్షమించరాని నేరం అంటూ పవన్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు నట్టి కుమార్. ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నా అందులో ఫ్యామిలీని తీసుకురావడం కరెక్ట్ కాదని అన్నాడు. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అన్నదమ్ముళ్లాగా కలిసి ఉండాలన్నారు.
ప్రాణాలను తీయాలని చూసే వారు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్స్ కాలేరని..సేవా కార్యక్రమాలు, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉన్నవాళ్లే నిజమైన ఫ్యాన్స్ అన్నారు. చిరంజీవి దీనిని సీరియస్ గా తీసుకొని ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…