మా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శణాస్త్రాలు సంధించుకుంటున్నారు. పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి మా బరిలో దిగుతున్న అభ్యర్థులు పవన్ పై విలేకురుల సమావేశం పెట్టి మరీ విమర్శిస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఘాటూగా స్పందించారు. పవన్ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల నరేష్ మాట్లాడుతూ.. ‘తాను నాన్ లోకల్ అని విమర్శించారని.. తాను ‘మా’లో సభ్యుడినే అని.. రెండు, మూడు సార్లు మత్రమే ఓటు వేయలేదు అని అన్నారు. తనను నాన్ లోకల్ అని విమర్శించిన మనిషికి సిగ్గుండాలంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రెండు నేషనల్ అవార్డులు తెచ్చానని..వీరు ఎవరైనా తెచ్చారా.. తెలుగు సినిమా గర్వించే పని చేశాను. తెలుగు సాహిత్యం మీద ఏ చర్చ పెట్టినా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరాడు.
ఇక మా ఎన్నికల్లో పవన్ కాళ్యాణ్ ను లాగడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పవన్ ను ఇందులోకి అనవసరంగా లాగుతున్నారని.. పవన్ కళ్యాణ్ పై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. మంచు విష్ణు ప్రశ్నించిన దానిపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ వైపా? ఇండస్ట్రీ వైపా? అని అన్నారని.. దానికి సమాధానంగా ప్రకాష్ రాజ్ ఇలా అన్నాడు.. పవన్ ది సినిమా పరిశ్రమ కాదా..? మీరు అతడిని పక్కన పెట్టారా.. ముందుగా అతడు మా సభ్యుడు.. ఆ తర్వాత రాజకీయ నాయకుడు.
ఆయనకు, జగన్కు ఎన్నో ఉంటాయి. సినిమా సమస్యలు గురించే పవన్ మాట్లాడారని అన్నాడు. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో అంత ఉండదు మీ సినిమా బడ్జెట్. పవన్ అడిగింది ఇండస్ట్రీ సమస్యలే. నేను ఎవరు పక్కన ఉన్నానని వారు అడగడం ఎందుకు? మా ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. దాని గురించి మాట్లాడాలి. నాకు పవన్ క్లోజ్ ఫ్రెండ్ కాదు. రాజకీయ పరంగా మా మధ్య విభేదాలు ఉన్నాయి. అయినా కలిసి సినిమాలు చేస్తున్నామన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…