Producer Pokuri Babu Rao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీలోనే పరిచయం, దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారి, ప్రజాస్వామ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.
రాజశేఖర్ మీద కోపంతో…
పోకూరి బాబు రావు గారు ఎక్కువగా రాజశేఖర్ గారితో సినిమాలను చేసారు. ‘అన్న’ సినిమా వాళ్లిద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమా. మొదటి నుండి నటుడు రచయిత అయిన పిఎల్ నారాయణ గారితో మంచి అనుబంధం ఉండి చొరవగా మామ అని పిలిచేవారట పోకూరి బాబు రావు గారు. ఒకానొక సినిమా సమయంలో ఆయనను కాల్చడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒంగోలు దగ్గర మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తుండగా జూనియర్ ఆర్టిస్ట్లు అందరూ సిద్ధంగా ఉన్నా హీరో రాజశేఖర్ ఇంకా షూటింగ్ కి రాలేదు. ఆ కంగారులో పోకూరి బాబు రావు గారు ఉండగా పిఎల్ నారాయణ గారు షూటింగ్ కోసమని తెచ్చిన డమ్మీ గన్ తీసుకుని ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో వేళాకోళం చేస్తుండగా పోకూరి బాబు రావు గారి దృష్టికి విషయం వెళ్లి జూనియర్ ఆర్టిస్ట్ ని కాకుండా నిన్ను కాల్చాలి మామ అని నారాయణ గారితో అని గన్ తీసుకుని గుండెకు గురి పెట్టారట.
అయితే అనుమానము వచ్చి గన్ గాలిలోకి పేల్చగా అది డమ్మి అని తెలిసాక మళ్ళీ గన్ గోంతు దగ్గర పెట్టి కాలుస్తా అని చెప్తే నారాయణ గారు నీ చేతుల్లో చావడం కంటేనా అల్లుడు అని నిలుచున్నారట. కాల్చగానే గొంతు నుండి రక్తం కారడం మొదలవగానే టెన్షన్ వచ్చింది అయితే అదే సమయంలో హీరో రాజశేఖర్ రావడంతో ఆయన ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి తరలించడంతో గండం గడిచింది అంటూ బాబురావు తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…