Movie News

Jr NTR: తారక్ సినిమా వల్ల ఊరొదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఎన్టీఆర్ గురించి ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్!

Jr NTR: ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులకు దర్శకనిర్మాతలకు హిట్లు ప్లాపులు రావడం సర్వసాధారణం. ఇలా అనుకోకుండా కొన్నిసార్లు అద్భుతమైన విజయాలను అందుకొని దూసుకుపోతున్న నిర్మాతలు సైతం కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ విధంగా తాను కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తాజాగా నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రొడ్యూసర్ గా అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు నిర్మించారు. తాజాగా ఈ నిర్మాణంలో సీతారామం అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత అశ్వినీ దత్ సైతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేసి తాను ఊరు వదిలి వెళ్లిపోయిన పరిస్థితి వచ్చిందని ఈ సినిమాతో తాను ఇండస్ట్రీ జోలికి వెళ్లకూడదని భావించానని ఈయన తెలిపారు. 2011 వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరికెక్కిన సినిమా శక్తి.

హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాను…

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కేవలం 50 శాతం వసూళ్లను కూడా వెనక్కి రాబట్ట లేకపోయింది.ఈ సినిమా ద్వారా ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్న తాను హైదరాబాద్ వదిలి విజయవాడ వెళ్ళిపోయానని అయితే అదృష్టవశాత్తు అప్పుడు తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటం వల్ల ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అశ్వినీ దత్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో ఇండస్ట్రీ జోలికి రాకూడదని భావించాను కానీ నా అశ్విన్ జాతి రత్నాలు మహానటి వంటి సినిమాలతో నన్ను నిలబెట్టారని ఈ సినిమాలతో కాస్త లబ్ధి పొందానని ఈ సందర్భంగా ఈయన పేర్కొన్నారు. ఇలా ఎన్టీఆర్ సినిమా గురించి అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

2 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

2 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

2 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

2 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

2 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

2 hours ago