మానవ శరీరానికి ప్రోటీన్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. కానీ ఈ ప్రోటీన్ల కోసం చాలా మంది నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రోటీన్లు అనేవి శాఖాహార పదర్థాలల్లో కూడా ఉంటాయి. ఇక నుంచి ప్రోటీన్లు కావాలంటే గుడ్లు, మాంసం వైపు మీ చూపు తిప్పుకోకుండా శాఖాహారంలో కూడా ఉండే ప్రోటన్ల గురించి కూడా తెలుసుకోండి.
వీటిని ప్రోటీన్లకు ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. అటువంటి 6 ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అంతే కాకుండా అందులో ఎంత వరకు ప్రోటీన్లు లభిస్తాయనే దాని గురించి కూడా తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో బలమైనది ఏదైనా ఉందంటే అది వేరుశనగ. అర కప్పు వేరుశెనగలో 20 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. వేరుశనగను నానబెట్టి తింటే ఎక్కువ ప్రోటీన్లు మన శరీరంలో కి వెళ్తాయి. పప్పుల్లో, చిక్కుడుజాతి గింజల్లో పీచు, ప్రోటీన్లు దండిగా ఉంటాయి. అందువల్ల ఇవి త్వరగా కడుపునిండిన భావన కలిగిస్తాయి.
దీనిలో ఒక గిన్నె పప్పులో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. సోయా పాలతో తయారు చేసిన పనీర్ను టోఫు అంటారు. 90 గ్రాముల టోఫులో సుమారు 9-10 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. మీరు టోఫు తినలేకపోతే.. దీనికి బదులుగా సోయాబీన్స్ తినవచ్చు. శనగపప్పును ప్రోటీన్ల మూలంగా పరిగణించబడతాయి. అర కప్పు శనగ పప్పు నుంచి సుమారు 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి.
రాజ్గిరా కూడా ప్రోటీన్కు మంచి మూలం. మీరు చేసుకునే చపాతీ పిండిలో రాజ్ గిరా పిండిని కలపండి. ఒక కప్పు రాజ్గిరాలో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. బాదం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. దీనిలో కూడా అనేక రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఇది కూడా చిక్కుడు జాతికి చెందిన మొక్కే. అర కప్పు బాదంలో దాదాపు 17 గ్రాముల ప్రోటీన్ లు ఉంటాయి. చిక్కుడు జాతి గింజల్లో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…