కరోనా సోకిన పిల్లల్లో కోవిడ్ వ్యాధి లక్షణాలు దీర్ఘకాలంగా ఉండవు. ఒక వారంలోనే కోలుకుంటారు. దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు కొద్దిమంది పిల్లలలో మాత్రమే కనిపిస్తాయని లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు తమ పరిశోధనల్లో తెలిపారు. ఈ పరిశోధన ప్రకారం 20 మంది పిల్లల్లో ఒక్కరు మాత్రమే నెల రోజుల పాటు బాధపడుతున్నారని తెలిపింది. అది కూడా 4 వారాలు మాత్రమే అని పరిశోధనలో వెల్లడైంది.
అదే 8 వారాల దాకా ఉన్నాడంటే మాత్రం.. ఆ పిల్లాడు పూర్తిగా కోలుకుంటాడు. పిల్లల్లో కోవిడ్ లక్షణాల్లో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు గొంతు నొప్పి, అలసట, తలనొప్పి మరియు వాసన రాకపోవడం. దీనికి సబంధించి అక్కడ కౌమార ఆరోగ్యం అనే జర్నల్లో ప్రచురించారు. కోవిడ్ బారిన పడిన పిల్లలు 4.4 శాతం వరకు మాత్రమే ఎక్కువ కాలం కోలుకోకుండా ఉంటుంన్నారని వెల్లడించింది.
4 వారాలలోపు కోలుకున్న వారికి కూడా ఎలాంటి ఇతర రోగాలు రావంటూ తెలిపారు. ఈ పరిశోధనను కోవిడ్ యాప్ అయిన జో యాప్ తో నిర్వహించారు. ఇది ఇంగ్లాండ్ లోని ప్రజలు ఉపయోగిస్తారు. ఈ యాప్లో 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 2.5 లక్షల మంది పిల్లల ఆరోగ్య డేటా ఉంటుంది.
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని పరిశోధకులు చెబుతున్నారు.
సోకినా చాలా మంది పిల్లలు లక్షణాలను కూడా చూపించరు లేదా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటారు. కొంతమంది పిల్లల్లో కోవిడ్ ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా తెలియదని చెబుతున్నారు. పిల్లలకు కోవిడ్ వల్ల విపరీతమైన ప్రమాదం మాత్రం లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…