Pruthvi Raj : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే పృథ్వీ రాజ్ గుర్తొస్తాడు. సినిమాల్లో ఎన్నో పాత్రలను చేసినా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ మాత్రం బాగా గుర్తింపు పొందింది. ఇక సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఇక రాజకీయాల్లో వైసీపీ లో చేరి జగన్ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ టీటీడీ లో ఎస్విబిసి చానెల్ కి చైర్మన్ గా పనిచేసారు. అయితే ఆ సమయంలో లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ పదివి నుండి తొలగించడం జరిగింది. ఇక పార్టీ నుండి బయటికి వచ్చిన పృథ్వీ ప్రస్తుతం జనసేన పార్టీ లో కొనసాగుతున్నారు. తాజా రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.
చెబితే వెళ్లిపోయేవాడిని, తోసేసారు…
30 ఇయర్స్ పృథ్వీ వైసీపీ నుండి బయటికి రావడం గురించి మాట్లాడుతూ వాళ్ళు నువ్వు వెళ్ళిపో అని చెప్పుంటే దండం పెట్టి నేనే వచ్చేసే వాడిని, ఇంత అపవాదు వేసి నన్ను తీసేయాల్సిన పని లేదు కదా అంటూ మాట్లాడారు పృథ్వీ. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, వాళ్లే జగన్ ను తప్పు దోవ పట్టిస్తారంటూ పృథ్వీ మాట్లాడారు. నేను రెడ్డి కులం కాదు కాబట్టి నన్ను బయటకు పంపేశారు అంటూ విమర్శించారు.
మరి వైసీపీ లోనే అంబటి, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్ మొదలగు వారి విషయంలో ఏం చేసాడు జగన్ మోహన్ రెడ్డి అంటూ పృథ్వీ ప్రశ్నించారు. అయితే జగన్ వల్ల నేను ఒక ఆరు నెలలు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండగలిగాను అంతకంటే ఏం కావాలి అంటూ మాట్లాడారు. సినిమా కుటుంబం నుండి వచ్చిన పవన్ కు సపోర్ట్ గా ఉందామని జనసేనలో చేరినట్లు పృథ్వీ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…