శాండిల్ వుడ్ నటుడు పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం తీవ్రమైన ఛాతీ నొప్పితో మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం అనంతరం ఛాతిలో నొప్పిగా ఉండటంతో ఇతని కుటుంబ సభ్యులు విక్రమ్ హాస్పిటల్ కు తరలించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇతని మరణవార్తను వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
కన్నడనాట ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడిగా విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు ఉన్నఫలంగా మృతి చెందారన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అభిమానులు ఎంతో విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈయన భౌతిక కాయాన్ని కంఠీరవ స్టేడయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. శనివారం అభిమానుల సందర్శనార్థం అతని అంతిమ యాత్ర మొదలవుతుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పునీత్ అంతిమయాత్రకు కర్ణాటక పోలీసులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలను నిర్వహించారు. ఈయన అంతిమయాత్రను ఘనంగా చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
పునీత్ రాజ్ కుమార్ అంతిమయాత్ర తర్వాత తన అంత్యక్రియలు తన తండ్రి సమాధి వద్ద జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేవలం పునీత్ తండ్రి సమాధి మాత్రమే కాకుండా, తన తల్లి పర్వతమ్మ సమాధి కూడా అక్కడే ఉండటం చేత పునీత్ అంత్యక్రియలు కూడా తల్లిదండ్రుల సమాధి వద్ద జరగాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే పునీత్ కు ఇద్దరు కుమార్తెలు అన్న విషయం మనకు తెలిసిందే.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…