పునీత్ మరణవార్తతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోయింది.అతని మృతదేహాన్ని చూసేందుకు అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. కడసారిగా చూసేందుకు అభిమానులు బారులు తీరుతున్నారు.తమ అభిమాన నటుడు ఇక లేరు అనే వార్త వినగానే గుండెపోటుతో పునీత్ అభిమాని ఒకరు కన్నుమూశారు.
మరి కొందరు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.పునీత్ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
టాలీవుడ్ నుండి నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి, నిర్మాత సాయి కొర్రపాటి, ప్రభుదేవా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సీనియర్ నరేష్, శివ బాలాజీ బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.తండ్రి రాజ్ కుమార్ ఉన్నప్పటి నుండి ఆ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది.
పునీత్ పార్థివ దేహాన్ని చూసి బాలయ్య భోరున విలపించారు.పునీత్ అన్న శివ కు ధైర్యం చెప్పారు. ఎప్పుడూ హుందాగా, గంభీరంగా కనబడే బాలయ్య భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శివన్నకు ధైర్యం చెప్పారు. తారక్ పునీత్ మధ్య మంచి స్నేహబంధం ఉంది.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…