పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించడం అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ పునీత్ లేరనే విషయం నమ్మశక్యంగా లేదనిపిస్తుంది. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఉన్నఫలంగా స్పృహ కోల్పోయి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతనిని బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో కన్నడ పవర్ స్టార్ ఇక లేరన్న విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
ఇలా ఒక్కసారిగా ఆయన మరణవార్త చెప్పడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఇక తాజాగా పునీత్ నటించిన యువరత్న సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పునీత్ తెలుగు భాష తెలుగు ఇండస్ట్రీతో తనకున్న సంబంధం గురించి బయట పెట్టారు. కన్నడ తెలుగు భాషశబ్దం ఒకటే కానీ పలికే విధానం మాత్రమే తేడా ఉంటుందని ఆయన వెల్లడించారు.
అందుకే తాను తెలుగు తొందరగా నేర్చుకున్నానని మరోసారి మీ ముందుకు వచ్చినప్పుడు అచ్చమైన తెలుగులో మాట్లాడతానని యువరత్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో వెల్లడించారు. ఇకపోతే త్వరలోనే రాజ్ కుమార్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తున్నారన్న విషయాన్ని కూడా ఇదే వేదికపై తెలియజేశారు.
ఇలా పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని తెలియజేసిన పునీత్ ఆ కోరిక నెరవేరకుండానే హఠాత్ మరణం పొందడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పునీత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…