General News

పెళ్లికి 100 మంది అతిథులు.. జైలుకు వరుడు.. కారణం తెలిస్తే?

ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా ను కట్టడి చేయడానికి అధికారులు అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎటువంటి శుభకార్యాలకు అయినా, పెళ్లిళ్ల కైనా కేవలం 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇటువంటి సమయంలోనే పంజాబ్ కు చెందిన ఓ యువకుడిని పెళ్లి అయిన మరుక్షణమే పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

పెళ్లి మరుక్షణం పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది. జలంధర్‌లోని ఓ ఆలయంలో పెళ్లి జరిగిన వెంటనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వందమందికి పైగా అతిథులు రావడమే కాకుండా వారెవరు కరోనా నిబంధనలను, జాగ్రత్తలను పాటించకుండా వ్యవహరించడంతో ఈ విషయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని వరుడిని, అతని తండ్రిని అరెస్టు చేశారు. ఉన్నఫలంగా పోలీసులు అక్కడికి రావడంతో బంధువులందరూ అక్కడి నుంచి తల ఓవైపు వెళ్ళి పోయారు. ఈ క్రమంలోనే వరుడు తన పెళ్ళికి కేవలం కొంతమందిని మాత్రమే ఆహ్వానించానని, పెళ్లికి వచ్చిన వారు తమ బంధువులు స్నేహితులను తాము పిలవలేదని, పెళ్లికి వచ్చిన వారిని వెళ్ళిపొమ్మని చెప్పడం బాగుండదు అన్న ఉద్దేశంతోనే సైలెంట్ గా ఉన్నామని వరుడు వివరించాడు.

కరోనా నిబంధనలను పాటించని నేరానికి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించడమే కాకుండా సినిమా థియేటర్లు, పార్కులు కోచింగ్ సెంటర్లు వంటివి పూర్తిగా మూసి వేసినట్లు జలంధర్ డిప్యూటీ కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 minutes ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

14 minutes ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

18 minutes ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

22 minutes ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

27 minutes ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

37 minutes ago