కరోనా రెండవ దశ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమయంలోనే బాధితులకు తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండవ దశ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించేలోపే తీవ్రస్థాయిలో దాడి చేయడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.
రెండవ దశ కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తులలో ఉంటూ శ్వాసక్రియ పై ప్రభావం చూపిస్తుంది అనే విషయం మనకు తెలిసినదే. ఫలితంగా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గిపోయి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులలోకి చేరుకుని ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదు. ఫలితంగా రక్తంలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోవటం వల్ల కరోనా బాధితుల్లో ఆక్సిజన్ సమస్య ఏర్పడుతుంది.
సాధారణంగా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు 94ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతకన్నా తక్కువగా ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి వైద్యుల సూచనలు పాటించాలి. మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఆక్సి మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. రోజుకు మూడు నాలుగు సార్లు ఆక్సి మీటర్ ద్వారా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తూ ఉండాలి.మన శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందనే విషయాలు డాక్టర్లకు తెలుస్తాయి కనుక డాక్టర్ల పర్యవేక్షణలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉండాలి.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…