కరోనా రెండవ దశ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమయంలోనే బాధితులకు తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండవ దశ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించేలోపే తీవ్రస్థాయిలో దాడి చేయడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.
రెండవ దశ కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తులలో ఉంటూ శ్వాసక్రియ పై ప్రభావం చూపిస్తుంది అనే విషయం మనకు తెలిసినదే. ఫలితంగా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గిపోయి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులలోకి చేరుకుని ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదు. ఫలితంగా రక్తంలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోవటం వల్ల కరోనా బాధితుల్లో ఆక్సిజన్ సమస్య ఏర్పడుతుంది.
సాధారణంగా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు 94ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతకన్నా తక్కువగా ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి వైద్యుల సూచనలు పాటించాలి. మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఆక్సి మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. రోజుకు మూడు నాలుగు సార్లు ఆక్సి మీటర్ ద్వారా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తూ ఉండాలి.మన శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందనే విషయాలు డాక్టర్లకు తెలుస్తాయి కనుక డాక్టర్ల పర్యవేక్షణలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉండాలి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…