Raghu Rama Krishnam Raju : ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలంటే… బీజేపీ తో ఉండే అవకాశమే లేదు..!

Raghu Rama Krishnam Raju : ప్రస్తుతం రాజకీయాలన్నీ చిన్న ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. మొన్నామధ్య అమిత్ షా కొమరం భీమ్ పాత్రలో బాగా నటించాడని ఎన్టీఆర్ ను పిలిచి అభినందించాను అంటూ చెప్పినా ఇందులో ఏదో ఉంది అంటూ అందరూ అనుకున్నారు. బీజేపీ తో ఎన్టీఆర్ కలిసి పనిచేస్తాడు అంటే మరికొంతమంది తెలంగాణలో బీజేపీ కి ఎన్నికల్లో ప్రచారం చేస్తాడు అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు బిజెపి వాళ్ళు ఒక మాట చెబుతుంటే ఇతర పార్టీల వాళ్ళు పొంతన లేకుండా వేరే చెబుతున్నారు. ఇక ఇపుడు వైసీపీ లోనే ఉంటూ స్వపక్షం లో విపక్షంలా ఉండే ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఎన్టీఆర్ బీజేపీ సంబంధాలపై మాట్లాడారు.

ఎన్టీఆర్ బీజేపీ వైపు చూడడు… టీడీపీ కి రావాలంటే 20 ఏళ్ళు…

తలా ఒకమాట అందరూ చెప్తూ ఈ భేటీ వెనుక అంతర్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ రాజకీయ ప్రయోజనాల కోసమే అంటూ స్పష్టం చేసి ఆయన సేవలను తెలంగాణలో ఉపయోగించుకుంటాం అంటూ చెప్పారు. ఇక సోము వీర్రాజు కుడా అత్యంత జనాధరణ కలిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన సేవలను పార్టీకి వినయోగించుకుంటామని చెప్పారు. టీడీపీ తో మా విధానం మారదని జనసేన మాత్రమే మిత్రపక్షం అంటూ చెప్పారు.

ఇక ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ బీజేపీ వైపు ఎన్టీఆర్ చూస్తే ఆ పారీ కి ప్రచారం చేయడం లాంటివి చేస్తే ఆయన ఒక వర్గం అభిమానులను కోల్పోతారు, ఆయన అలా చేయరని అనుకుంటున్నాను అని చెప్పారు. ఇక టీడీపీ వైపు చూడటానికి జూనియర్ కి ఇంకా టైం ఉందని ఇంకో 20 ఏళ్ల తరువాత రాజకీయాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఆదినాయకత్వంలోని ముఖ్యనేతలతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago