Rajashekhar : డాక్టర్ రాజశేఖర్, మే 20న శేఖర్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపిన చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన వివరాలను తెలుపుతూ రాజశేఖర్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇక చిత్రం గురించిన ముచ్చట్లు అలాగే ఇటీవలే కోవిడ్ వల్ల పడ్డ కష్టాలను వివరించారు.
ఇక జీవితం అయిపోయిందనుకున్నా…
ఇక కరోనా సోకినపుడు చాలా రోజులు హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చిందని 75 కేజీల బరువు నుండి 62 కేజీలకు వచ్చానని చెప్పారు. ఇక హాస్పిటల్స్ లో బోర్ కొట్టకుండా ఉండటానికి టీవీ ఉండేది అందులో సినిమాలు ఫైట్లు చూసినపుడు ఇలా ఉండాల్సిన నేను ఎలా ఉన్నాను అనుకునేవాడిని, ఇక జీవితం అయిపోయిందని అనిపించింది. అందుకే శేఖర్ సినిమా హక్కులను వేరే వాళ్లకు ఇచ్చేయమని చెప్పాను కానీ జీవితా, పిల్లలు తిరిగి నువ్వు కోలుకుంటావని ధైర్యం చెప్పారు.
ఎంతైనా కూతుళ్లు ఎక్కువే…..
ఇక ఆ కష్టకాలంలో నన్ను చూసుకుంది నా ఇద్దరు కూతుళ్ళే. ఐసీయూలోనే నలుగురు ఉండిపోయాము. కాస్త కదిలిన ఏమి కావాలి నాన్న అంటూ ఇద్దరు వచ్చే వాళ్లు జీవితా కూడా నన్ను బాగా చూసుకుంది. నా తమ్ముడికి ఇద్దరు కొడుకులు కానీ తాను నేను కోలుకున్నాక చెప్పిన మాట ఒకటే నీ కూతుళ్ళే అన్ని చూసుకున్నారు. గుర్తు పెట్టుకో నా కొడుకులు కూడా నన్ను అంతలా చూసుకోలేదు అన్నాడు. నిజంగా కొడుకులు తక్కువని కాదు కానీ కూతుళ్లు మాత్రం ఎక్కువే అంటూ చెప్పారు.
శేఖర్ లాంటి ఎనర్జెటిక్ సినిమా మళ్ళీ చేయలేను….
మలయాళం రీమేక్ సినిమాగా రాబోతున్న శేఖర్ సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ మేక్ ఓవర్ లో కనిపించాను సినిమా కోసం కష్టపడ్డాను. దర్శకురాలిగా జీవిత ఏమి కావాలో అది రాబట్టుకుంది. ఇక శివాని నా కూతురు కాబట్టి కథలో పాత్ర నిడివి పెంచడం చేయలేదు. అనూప్ సంగీతం బాగుంది. సినిమాకోసమా అప్పులు చేసాము. అందుకే సినిమా హిట్ అవ్వకపోతే పరిస్థితి కష్టమవుతుందనే సినిమాను బతికించండి అనే మాట మనసు నుండి వచ్చేసింది ఈవెంట్ లో అంటూ చెప్పారు. సాయి కుమార్ చాలా రోజుల తరువాత శేఖర్ సినిమా కోసం రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…