Ramachandhra Rao PN : ‘సంధ్యారాగం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామచంద్ర రావు పిఎన్ ఆ తరువాత వచ్చిన ‘మెరుపు దాడి’ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మంచి విజయాలను అందుకున్నారు. ఇక తెలుగులో ఉన్నట్టుండి చాలా గ్యాప్ వచ్చింది పిఎన్ఆర్ గారికి. ఇక ఆయన కెరీర్ లో గ్యాప్, సినిమాలు లేకుండా ఉన్నందుకు కారణాలను వివరించారు.
ఎన్టీఆర్ కోసం మూడేళ్లుగా వెయిట్ చేశా…
కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాక ఆర్థికంగా కూడా నష్టం వచ్చి ఇబ్బందులు పడుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఏవంటే అవి సినిమాలను చేయొద్దు మనం ఒక మంచి సబ్జెక్టు చేద్దాం అంటూ వెయిట్ చేయమని చెప్పడం తో చాలా కాలం ఎదురుచూశా కానీ ఎన్టీఆర్ ఎదిగి పోతున్నాడు నేను మాత్రం అక్కడే ఉండిపోయా అంటూ పిఎన్ఆర్ చెప్పారు. ఇక ఎదురుచూస్తూ ఉన్న సమయంలో ‘గోల్మాల్’ సినిమా అవకాశం వచ్చింది.
ఇక ఎన్టీఆర్ ను సంప్రదిస్తే మంచి కథ చేయమని చెప్పారు. ఇక జేడీ చక్రవర్తి కన్నడ హీరో రమేష్ అరవింద్ లను హీరోలుగా సినిమా చేయాలనుకున్నాక ఫైనాన్సిర్ గా ఉన్న అతను ఒక్కసారిగా చేతులెత్తేయడం, నిర్మాత కూడా చేయిదాటి పోవడం వల్ల నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ సినిమా వరల్డ్ కప్ సమయంలో రిలీజ్ అవ్వడం వల్ల సినిమా బాగున్నా పెద్దగా కలెక్షన్స్ రాలేదు. వచ్చిన దాంట్లో అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్ చేసాను. కానీ నాకు మాత్రం మూడు కోట్లు నష్టం వచ్చింది. ఇంకా కోలుకోలేదు అంటూ చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…