Ramayanam : హిందూ మతస్థులు ఆరాధించే దేవుళ్ళలో ఒకరైన రాముడు, ఆయన జీవితమే రామాయణం. వాల్మీకి రచించిన అద్భుతం రామాయణం. కానీ అది వాస్తవంగా జరిగిన కథ అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆది కల్పితం అంటూ కొట్టిపడేసే వాళ్ళు ఉన్నారు. అయితే రామాయణం నిజంగా జరిగిందా లేదా అని చరిత్రకారులు పలు పరిశోధనలు జరిపి సాక్ష్యాలను సేకరించారు. మనిషి నడవడిక ఎలా ఉండాలో తెలిపిన రాముడి జీవితం అందరికీ ఆదర్శనీయం అయితే రామాయణం నిజమని నిరూపించే చరిత్ర సాక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం.
రాముడు జననం గురించి వాల్మీకి రామాయణ ఏం చెబుతోంది…
చరిత్రకారుల పరిశోధనల ప్రకారం శ్రీరాముడి జననం ఇప్పటి కాలమానం ప్రకారం 5114 బీసీ జనవరి 10న మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య జన్మించారని నిర్ధారించారు. ఈ విషయాలను వాల్మీకి రచించిన రామాయణంలో మొదటి అధ్యాయం 18వ ఖండంలో రాసారు. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ వారు లెక్కగట్టి ఆది హిందూ క్యాలెండరు ప్రకారం ఆది చైత్ర మాసం లో మనం ప్రస్తుతం జరుపుకుంటున్న శ్రీరామనవమి రోజున అని నిర్ధారించారు.
రామాయణం నిజం అని నిరూపించే మరో రుజువు సీతను అపహారించిన రావణుడు ఆమెను లంకలోని అశోకవనంలో పెట్టాడు. ప్రస్తుతం ఉన్న శ్రీలంక లో ఈ ఉద్యానవనం ఉంది, రామాయణంలో అశోక వనంలో ఉన్న చెట్లు ఇప్పటికీ శ్రీలంక లోని ఉద్యానవనం లో సరిగా అక్కడే ఉన్నాయి. సీతను అపహారించిన రావణుడిని అడ్డుకున్న జటాయువు అనే పక్షి రెక్కలను రావణుడు విరిచేస్తే ఆ పక్షి పడిన నేల ప్రస్తుతం కేరళ లోని కోళ్లం లో ఉంది. అక్కడ భారత దేశంలోని అతిపెద్ధ రాతి నిర్మాణంలో ఉన్న జటాయువు రూపం అక్కడ ఉంది.
ఇక సీతాదేవి అశోక వనంలో ఉన్నపుడు స్నానానికి వాడిన జలపాతం శ్రీలంక లోని నోవారా ఆలయం వద్ద ఉంది. అక్కడ ఉన్న కొండా మీద పెద్ద కాలి గుర్తులు ఆంజనేయుడు లంక కు వచ్చినపుడు వేసినవని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక రావణుడికి ఉన్న చాలా పుష్పక విమానాలు కోసం విమానాశ్రయాల వంటి ప్రదేశాలు లంకలో ఉండేవని లంక పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రామాయణం ఉనికిని తెలిపే మరో ఆధారం రామేశ్వరం వద్ద ఉన్న రామసేతు రాతి బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ సముద్రంలో ఉంది. ఇక చివరగా రావణుడి రాజభవనంను శ్రీలంకలో కనుగొన్నారు. అందులో లంకలోని అనేక ప్రదేశాలకు రహస్య మార్గాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక లంక చరిత్రలో రావణుడు రహస్య మార్గాలను ద్వారా ప్రజలకు దర్శనమిచ్చేవాడని పేర్కొన్నారు. ఇది కూడా రామాయణం ఉనికిని నిరూపిస్తుంది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…