Ramcharan: సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారు ధరించే బట్టలు చెప్పులు దగ్గరినుండి వారు నివసించి ఇల్లు తిరిగే కార్లు అన్నీ కూడా చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ఎవరి ఇమేజ్ కి తగ్గట్టు వారు లగ్జరీగా జీవిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల లగ్జరీ లైఫ్, వారు ఉపయోగించే వస్తువుల ధరలు గురించి తెలిస్తే సామాన్య ప్రజలు నోరెళ్లబెడతారు.
ఇదిలా ఉండగా ఇటీవల పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్ ధరించిన షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా రామ్ చరణ్ కి అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక తాజాగా మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సౌత్ ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ధరించిన దుస్తులు, వస్తువులు , బ్యాగులు, వారు తిరిగే కార్లు ఇలా అన్నింటి వివరాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా సెలబ్రెటీలు ధరించే దుస్తుల ధరల గురించి తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పుట్టినరోజున రాంచరణ్ ధరించిన షర్టు గురించి కూడా సెర్చ్ చేశారు. ఆ షర్ట్ ఖరీదు చూసి షాక్ అవటం వారి వంతయింది.
బర్త్డే పార్టీలో రామ్ చరణ్ లైట్ బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ తో షర్ట్ తో కనిపించాడు. రామ్ చరణ్ ధరించిన షర్ట్ ధర గురించి సెర్చ్ చేయగా.. ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్ సైట్ లో కనిపించింది. జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉంది. ఈ షర్ట్ ఖరీదు 983 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.80,961 ఆ షర్ట్ ఖరీదు చూసి అభిమానులు షాక్ అయ్యారు. సెలబ్రిటీలు వారి స్థాయికి తగ్గట్టు ఇలాంటి ఖరీదైన బట్టలు ధరించడం సర్వ సాధారణం.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…