Ramcharan: మెగా పవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న g20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.మే 22 నుంచి మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలలో రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరపున హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మన ఇండియాలో ఎంతో అందమైన లొకేషన్లో ఉన్నాయి. కాశ్మీర్ లాంటి అందమైన లొకేషన్లో ఈ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని రామ్ చరణ్ తెలియజేశారు.
మన ఇండియాలో కేరళ కాశ్మీర్ వంటి ఎన్నో ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉన్నాయని ఈ ప్రాంతాలన్నింటిని తాను సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని చరణ్ తెలిపారు.ఇకపై లొకేషన్ ల కోసమే ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు.
ఇక తాను భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు చేసిన హాలీవుడ్ దర్శకులకు కూడా తాను ఇదే కండిషన్ పెడతానని, హాలీవుడ్ దర్శకులకి కూడా ఇండియాలో ఉండే ప్రకృతి అందాలను చూపిస్తాను అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాలో నార్త్ సౌత్ అని రెండు సినిమాలు లేవు ఉన్నది ఒక్కటే అది ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…