Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి ఉండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక నచ్చినా నచ్చకపోయినా సినిమా విషయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పే రమేష్ రెడ్డి గారు దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు. ఇక నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ రెడ్డి గారు తొలి అనుభవాన్ని పంచుకున్నారు.
బాలయ్య తో మొదట సీన్ భయం వేసింది… వెంకటేష్ గారు అలా అరిచారు…
రవిరాజా గారి డైరెక్షన్ లో బాలయ్యబాబు సినిమా షూటింగ్ జరుగుతుంటే నక్సలైట్ పాత్ర చేయాల్సిన ఆర్టిస్ట్ దొరకలేదు. ఇక షూటింగ్ స్పాట్ లో అప్పటికి అప్పుడు నన్ను చేయమన్నారు డైరెక్టర్. ఆరు పేజీల భారీ డైలాగును చెప్పాలి అంటే రాసింది నువ్వే కదా చెప్పడానికి ఏంటి అంటూ నన్ను రెడీ అవ్వమని చెప్పారు. మొదటి సన్నివేశం కైకాల సత్యనారాయణ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో బాలయ్య బాబు గొంతు పట్టుకుని చెప్పే సీన్ భయం వేసింది కానీ మొదటి టేక్ లోనే చెప్పేసాను అందరూ మెచ్చుకున్నారు.
ఇక బాలయ్యబాబు నీకు మంచి టైమింగ్ ఉంది మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు నీలో అంటూ పొగిడారు. ఇక వెంకటేష్ గారి ‘శీను’ సినిమాకి డైలాగులు రాసాను ఆ సమయంలో రాజా రవీంద్ర నేను షూటింగ్ దగ్గర గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే లోపల షూటింగ్ లో ఉన్న వెంకటేష్ గారు ఏంటి అంత గట్టిగా రమేష్ అరుస్తున్నాడు ఇక్కడికి వచ్చి ఆ డాక్టర్ వేషం వేయమను, అదేదో ఇక్కడొచ్చి అరవమను అంటూ అన్నారు అలా శీను లో కూడా నటించాను. ఇక బాలయ్యబాబు నన్ను గోపి ని కలిపి భలే ఉన్నారయ్య ఇద్దరూ తిరుపతి వెంకట కవుల లాగా అంటూ అనేవారు అంటూ అయన నటనా అనుభవాలు పంచుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…