Ramya Krishna: రమ్యకృష్ణ తెలుగు తమిళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా అంతే బిజీగా ఉన్నారు.తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోల ద్వారా సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈమె కేవలం హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా మెప్పించారు.
ఇలా సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలిగిన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్లారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ ఆ సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చడంతో తనకు బాలీవుడ్ ఇండస్ట్రీ అచ్చు రాలేదని తిరిగి సౌత్ ఇండస్ట్రీలోని కొనసాగారు.ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె ఎంతో మంది యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు.
తాజాగా రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఆహా వేదికగా ప్రసారమవుతున్నటువంటి డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
ఓంకార్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ తో పాటు రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె జడ్జిగా కొనసాగడం కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు రమ్యకృష్ణ ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 4.5 లక్షల రెమ్యూనరేషన్ అందు కుంటుందని సమాచారం.అయితే ఈ విషయం గురించి క్లారిటీ తెలియకపోయినాప్పటికీ ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఎవరూ కూడా తీసుకోనటువంటి రెమ్యూనరేషన్ ఈమె తీసుకుంటుందని చెప్పాలి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…