Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ప్రసారమవుతూ ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది. ఇదివరకు సీజన్లలో మొదటి వారమే బిగ్ బాస్ నుంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా హౌస్ లోకి వచ్చిన మూడు రోజులకే ఒక వ్యక్తి గురించి సరిగా తెలియకుండా ఎలిమినేట్ చేయడం భావ్యం కాదని భావించిన నిర్వాహకులు మొదటి వారం ఎలిమినేషన్ లేకుండా అందరిని సేవ్ చేశారు.
ఇకపోతే రెండవ వారంలో మాత్రం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది.మొదటి వారంలో ఏడు మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండగా అందులో అభినయశ్రీ బయటకు వెళ్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే రెండవ వారంలో కూడా ఆమె తిరిగి నామినేషన్ లో ఉన్నారు. ఈ వారంలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. ఈ 8 మందిలో ఐదుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు.
ఆదిరెడ్డి , గీతురాయల్, షానీ, అభినయశ్రీ ఇంకా రాజ్ శేఖర్ డేంజర్ జోన్ లో ఉండగా రాజశేఖర్ కెప్టెన్ కావడంతో ఈయన ఈ వారం సేఫ్ అయినట్టు తెలుస్తోంది. ఇక బేబీ బొమ్మల టాస్కులో అభినయ తన బేబీని కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈమెతో పాటు షానీ కూడా ఆటలో గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. వచ్చిన ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ని సరిగా టైం కి పెట్టకపోవడం వల్ల ఓటింగ్ లో ఈయన కూడా లీస్ట్ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలా ఇద్దరు కంటెస్టెంట్లకు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటం వల్ల వీరిద్దరూ బయటికి వస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత సీజన్లలో మాదిరిగానే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ల గురించి ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని వారిలో అభినయ, షానీ ఇద్దరూ ఎలిమినేట్ కానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే వేచి చూడాలి.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…