Rashmi Gowtham : సుధీర్, రష్మీ… వీళ్ళ కెమిస్ట్రీ ముందు మరే జంట ప్రేక్షకులకు కనిపించరు. బుల్లితెర అభిమానులు ఎప్పుడు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్న ఆ జంట ఎవరో కాదు సుధీర్, రష్మీ. జబర్దస్త్ మొదలయ్యాక యాంకర్ గా పనిచేస్తున్న రష్మీ కి కమెడియన్ గా అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కి మధ్య జబర్దస్త్ టీం లవ్ ట్రాక్ ను క్రియేట చేసారు. ఆన్ స్క్రీన్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వారి జంటను చూసిన ప్రేక్షకులు వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో పెళ్లి చెసుకుంటే బాగుంటుందని అనిపించేలా వల్ల కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది. ఒకరకంగా వాళ్లిద్దరూ ఏ ప్రోగ్రామ్ లో ఉంటారో ఆ ప్రోగ్రామ్ రేటింగ్స్ బాగా పెరిగేవి. అంతగా ఆకట్టుకున్న ఈ జంట మధ్య నిజంగా ఎమన్నా ఉందో లేక కేవలం షో కోసం ఈ బిల్డ్ అప్ అంతేనా అనే విషయం మీద చాలా మంది సందేహలకు క్లారోటీ ఇచ్చింది రష్మీ.
సుధీర్ తో లవ్, మ్యారేజ్…
రీసెంట్ గా సుధీర్ ఈటీవీ షోస్ నుండి బయటకు వచ్చేసాడు. అయితే రష్మీ మాత్రం ఈటీవీ లో అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి కంపెనీ అంటూ అన్ని షోలనూ చేస్తోంది. బయటి ఆఫర్స్ వస్తోన్నా మల్లెమాల సంస్థ అంటే ఇష్టమంటూ చెబుతున్న రష్మీ సుధీర్ తో నిజంగా లవ్ లో ఉందా, పెళ్లి ఎపుడు చేసుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సుధీర్ తో తన రిలేషన్ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుండీ ఉందని ఆన్ స్క్రీన్ అలా చూపించినా ఆఫ్ స్క్రీన్ మాత్రం మంచి ఫ్రెండ్స్ అంటూ చెల్పింది.
మా మధ్య ఏ బంధం లేదు అని నేను చెప్పలేను షో లో చూపించేది రేటింగ్స్ కోసమే అయినా మా ఎమోషన్స్ అందులో కొంత నిజముంటుంది. దాదాపు పదేళ్ళ పైబడి మేము కలిసి పని చేస్తున్నాము అలాంటప్పుడు మా మధ్య ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా ఎలా ఉంటుంది అంటూ చెప్పింది. ఇక భవిష్యత్ లో సుధీర్ మళ్ళీ జబర్దస్త్ కి వస్తాడా అనే విషయంలో గురించి మాట్లాడుతూ నాకు తెలిసినా నేను చెప్పకూడదు, అది తన వ్యక్తిగత విషయం అంటూ చెప్పింది. ఇక మల్లెమాల సంస్థ అంటే చాలా ఇష్టం అంటున్న రష్మీ వేరే ఛానెల్స్ నుండి ఆఫర్స్ వచ్చినా మల్లెమాల ను వదలలేక ఇక్కడే ఉన్నాను అంటూ చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…