Rashmi Gowtham : సుధీర్, రష్మీ… వీళ్ళ కెమిస్ట్రీ ముందు మరే జంట ప్రేక్షకులకు కనిపించరు. బుల్లితెర అభిమానులు ఎప్పుడు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్న ఆ జంట ఎవరో కాదు సుధీర్, రష్మీ. జబర్దస్త్ మొదలయ్యాక యాంకర్ గా పనిచేస్తున్న రష్మీ కి కమెడియన్ గా అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కి మధ్య జబర్దస్త్ టీం లవ్ ట్రాక్ ను క్రియేట చేసారు. ఆన్ స్క్రీన్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వారి జంటను చూసిన ప్రేక్షకులు వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో పెళ్లి చెసుకుంటే బాగుంటుందని అనిపించేలా వల్ల కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయింది. ఒకరకంగా వాళ్లిద్దరూ ఏ ప్రోగ్రామ్ లో ఉంటారో ఆ ప్రోగ్రామ్ రేటింగ్స్ బాగా పెరిగేవి. అంతగా ఆకట్టుకున్న ఈ జంట మధ్య నిజంగా ఎమన్నా ఉందో లేక కేవలం షో కోసం ఈ బిల్డ్ అప్ అంతేనా అనే విషయం మీద చాలా మంది సందేహలకు క్లారోటీ ఇచ్చింది రష్మీ.
సుధీర్ తో లవ్, మ్యారేజ్…
రీసెంట్ గా సుధీర్ ఈటీవీ షోస్ నుండి బయటకు వచ్చేసాడు. అయితే రష్మీ మాత్రం ఈటీవీ లో అటు జబర్దస్త్, ఇటు శ్రీ దేవి కంపెనీ అంటూ అన్ని షోలనూ చేస్తోంది. బయటి ఆఫర్స్ వస్తోన్నా మల్లెమాల సంస్థ అంటే ఇష్టమంటూ చెబుతున్న రష్మీ సుధీర్ తో నిజంగా లవ్ లో ఉందా, పెళ్లి ఎపుడు చేసుకుంటారు అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. సుధీర్ తో తన రిలేషన్ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుండీ ఉందని ఆన్ స్క్రీన్ అలా చూపించినా ఆఫ్ స్క్రీన్ మాత్రం మంచి ఫ్రెండ్స్ అంటూ చెల్పింది.
మా మధ్య ఏ బంధం లేదు అని నేను చెప్పలేను షో లో చూపించేది రేటింగ్స్ కోసమే అయినా మా ఎమోషన్స్ అందులో కొంత నిజముంటుంది. దాదాపు పదేళ్ళ పైబడి మేము కలిసి పని చేస్తున్నాము అలాంటప్పుడు మా మధ్య ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా ఎలా ఉంటుంది అంటూ చెప్పింది. ఇక భవిష్యత్ లో సుధీర్ మళ్ళీ జబర్దస్త్ కి వస్తాడా అనే విషయంలో గురించి మాట్లాడుతూ నాకు తెలిసినా నేను చెప్పకూడదు, అది తన వ్యక్తిగత విషయం అంటూ చెప్పింది. ఇక మల్లెమాల సంస్థ అంటే చాలా ఇష్టం అంటున్న రష్మీ వేరే ఛానెల్స్ నుండి ఆఫర్స్ వచ్చినా మల్లెమాల ను వదలలేక ఇక్కడే ఉన్నాను అంటూ చెప్పింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…