Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి ఆదరణ రావడంతో బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక వరుస వివాదాల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తనకు లైఫ్ ఇచ్చినటువంటి రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా చూశారా అని మీడియా ప్రశ్నించగా సినిమా చూసి అంత టైం నాకు లేదంటూ ఈమె చెప్పిన సమాధానం ఎలాంటి పరిణామాలకు దారి తీసినదో మనకు తెలిసిందే. ఈ వివాదం మర్చిపోకముందే రష్మిక మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక సాంగ్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఈవెంట్ నిర్వహించగా ఈ వేడుకలో రష్మిక సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రొమాంటిక్ సాంగ్స్ తెరకేక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్. సౌత్ ఇండస్ట్రీలో మాస్ మసాలా కమర్షియల్ హంగులు మాత్రమే ఉంటాయని సౌత్ సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను మొదటిసారి రొమాంటిక్ సాంగ్ చేశానని పాట కోసం తాను చాలా ఎక్సైట్ గా ఉన్నాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.దీంతో పలువురు రష్మిక వ్యాఖ్యలపై స్పందించి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు తమిళ భాషలలో మంచి గుర్తింపు పొందావు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ పై ఆరోపణలు చేశావు. ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలు రావడంతో సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ ఇండియా మొత్తం సౌత్ సినిమాల గురించి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటూ పెద్ద ఎత్తున నేటిజల్లు ట్రోల్ చేస్తున్నారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…