రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు నటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. కమెడియన్ గా కూడా అతడు తన మార్క్ ను చూపించాడు. మొదటిసారిగా అల్లరితో దర్శకుడి అవతారమెత్తి ఆ జోనర్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
అల్లరి సినిమా హిట్ కావడంతో.. తర్వాత ఎన్నో సినిమాలను తెరపైకి ఎక్కించాడు. అందులో నచ్చావులే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత అతడు థ్రిల్లర్లు, హర్రర్ సినిమాల వైపు కన్నేశాడు. అందులో భాగంగానే అతడు హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా భూమిక, పూర్ణలను ఎంచుకున్నాడు.
దాదాపు వీళ్లతోనే ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో రవిబాబుకు వీళ్లకు మధ్య ఏదో ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కోడై కూశాయి. దీనిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ సినిమా తీసినా ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క హీరోయిన్ తో కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు.
అటువంటి క్యారెక్టర్ నాది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. పూర్ణతో వరుసాగా మూడు సినిమాలు తీశాను.. కేవలం ఆమె అభినయం కారణంగానే తన సినిమాల్లో పెట్టుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. తనతో మరో సినిమా తీయడానికి ఎలా ముందుకు వస్తారు.. అస్సలు ఇష్టపడతారా.. అంటూ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు అంటూ చెప్పుకొచ్చాడు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…