మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ పొదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలీక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే సరైన విధంగా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో తక్కువ సమయంలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అదిరిపోయే లాభాలను అందిస్తున్నాయి.
అయితే అదిరిపోయే లాభం పొందాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోవడంతో పాటు దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 స్కీమ్స్ ఇతర స్కీమ్ లతో పోలిస్తే అదిరిపోయే ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో మొదటిది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 7.4 శాతం వడ్డీని పొందవచ్చు. గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరే ఛాన్స్ ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా అదిరిపోయే లాభాలను అందిస్తోంది. 1000 రూపాయల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా ఖాతాలో వడ్డీ డబ్బులు జమవుతాయి. ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టి కూడా సులువుగా ఆదాయం పొందవచ్చు.
ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి నష్టం ఉండదు. బజాజ్ ఫైనాన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి సులభంగా అదిరిపోయే లాభాలను పొందవచ్చు. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు సైతం ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి రిస్క్ ఉండదు.
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…