Kondaa Movie: సాయి పల్లవికి రెడ్ కార్పెట్.. రేవంత్ రెడ్డికి నో పర్మిషన్.. తెలంగాణ మంత్రి పై ఫైర్ అయిన సుస్మిత పటేల్?
Kondaa Movie: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ చిత్రాలు చేస్తూ పలు వివాదాలకు కారణం అవుతున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాలు రాగ తాజాగా కొండా మురళి సురేఖ దంపతులు బయోపిక్ చిత్రం ద్వారా కొండా అనే సినిమాతో ఈ నెల 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడటంతో కొండ సురేఖ దంపతులు సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హనుమకొండలో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావాల్సి ఉండగా కొందరు రాజకీయాలు చేస్తూ అతనిని రాకుండా అడ్డుకున్నారు అంటూ ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై కొండా సినిమా నిర్మాత,కొండా సురేఖ మురళి దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ మాట్లాడుతూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు నీ బతుకు మారదా? నీ బతుకంతా భయంతోనే సాగిపోతోంది. విరాట పర్వం సినిమా వేడుకల్లో భాగంగా సాయిపల్లవికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు.
ఎన్నికలు రానివ్వు నీ సంగతి చూస్తా..
నా సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా వస్తున్న రేవంత్ రెడ్డిని రాకుండా ఆపారు. ఇలా ఎంత కాలం భయపడతావు ఎన్నికలు రానివ్వు నీ సంగతిచెబుతా అంటూ వేదికపై సుస్మిత పటేల్ తీవ్రస్థాయిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లితండ్రుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కొండా చిత్రానికి సుస్మితా పటేల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…