Vagdevi : ఆహా ఒరిజినల్స్ లో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షో కి బాగా క్రేజ్ ఉంది. సింగర్ కార్తీక్, నిత్యా మీనన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ జడ్జెస్ గా ఉన్న ఈ షోలో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఇక ఈషో రీసెంట్ గా తుది దశకు చేరుకొని టాప్ కంటెస్టెంట్స్ లో ఎవరు విజేతగా నిలుస్తారో అని ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక ఫైనల్స్ కి చిరంజీవి ముఖ్య అతిధి గా సాయి పల్లవి, రానా అతిధులుగా వచ్చారు. ఇక ఫైనల్ గా వాగ్దేవి విజేతగా నిలిచింది.
చిరు సినిమాలో పాడే అవకాశం…..
ఇక వాగ్దేవి ఫైనల్స్ లో విజేత అయ్యాక, మెగాస్టార్ చిరంజీవి గారు తన నెక్స్ట్ సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఇక సింగర్ కార్తీక్ కూడా తన నెక్స్ట్ మ్యూజిక్ ప్రాజెక్ట్ లో సింగర్ గా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇక గీత ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం అందుకుంది. తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న వాగ్దేవి తన నేపథ్యం, తన అభిరుచుల గురించి మాట్లాడింది. నెల్లూరుకి చెందిన వాగ్దేవి తండ్రి ఎల్ ఐ సి లో పనిచేస్తారని తన తల్లికి సంగీతమంటే చాలా ఇష్టం ఉండటంతో సంగీతం క్లాసులకు పంపేదని మా అక్క నేను క్లాసులకు వెళ్లి సంగీతం నేర్చుకున్నామని, ఆ తరువాత త్యాగరాజ భవనంలో సంగీత కచేరిలు తన అక్కతో పాటు చేయడం వల్ల వైవ సిస్టర్స్ అని పేరు వచ్చింది అని తన అక్క పేరు వైష్ణవి, తన పేరు వాగ్దేవి కావడంతో అలా వైవ సిస్టర్స్ అని పేరొచ్చిందని తెలిపింది.
ఇక ఆర్చిటెక్ట్ చదువుతున్న తాను నెక్స్ట్ ఇండియన్ ఐడల్ కి పోటీకి వెళ్తారా అని అడుగగా ఆసక్తి లేదని చెప్పింది. ఇక చిత్ర గారంటే చాలా ఇష్టమని హీరోలలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, ఇక హీరోయిన్ కీర్తీ సురేష్ ఇష్టమని చెప్పింది. ఇక జడ్జెస్ గా వ్యవహరించిన థమన్, కార్తీక్, నిత్యా మీనన్ గురించి చెబుతూ థమన్ చాలా డిటైల్డ్ గా మా తప్పులను చెబుతారని అది నెక్స్ట్ పాటకు బాగా ఉపయోగపడుతుందని చెప్పింది. ఇక నిత్యా మీనన్ ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో బాగా చెబుతారని, ఇక కార్తీక్ అవసరమైతే తప్ప గట్టిగా ఏమి చెప్పరని, ఎపుడు చక్కగా గైడ్ చేస్తారని చెప్పింది. ఇక హోస్ట్ శ్రీ రామ్ కూడా మంచి సలహాలు ఇస్తారని చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…