Renu Desai:రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె పవన్ కళ్యాణ్ తో అదే సినిమాలో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు.ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నటించిన జానీ సినిమా తర్వాత ఈమె పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.
ఇలా వెండితెరకు దూరమైనటువంటి ఈమె కొన్ని రోజులపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న అనంతరం రేణు దేశాయ్ పూణేలో తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటివరకు ప్రారంభించలేదు.
ఈ క్రమంలోనే ఈమె రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తాను హేమలత అనే పాత్రలో నటిస్తున్నానని తెలియజేయడమే కాకుండా తన పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా వెల్లడించారు. ఈ విధంగా ఈమె తన పాత్ర గురించి తెలియజేస్తూ హేమలత లవణంగారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటించే అవకాశం తనకు కల్పించినందుకు దర్శకుడు వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ ఈమె తన పాత్ర గురించి వెల్లడించారు. రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…