Renu Desai:రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె పవన్ కళ్యాణ్ తో అదే సినిమాలో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు.ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ నటించిన జానీ సినిమా తర్వాత ఈమె పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.
ఇలా వెండితెరకు దూరమైనటువంటి ఈమె కొన్ని రోజులపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం పవన్ కళ్యాణ్ తో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు తీసుకున్న అనంతరం రేణు దేశాయ్ పూణేలో తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ అక్కడే ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటివరకు ప్రారంభించలేదు.
ఈ క్రమంలోనే ఈమె రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా రేణు దేశాయ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తాను హేమలత అనే పాత్రలో నటిస్తున్నానని తెలియజేయడమే కాకుండా తన పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా వెల్లడించారు. ఈ విధంగా ఈమె తన పాత్ర గురించి తెలియజేస్తూ హేమలత లవణంగారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటించే అవకాశం తనకు కల్పించినందుకు దర్శకుడు వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు అంటూ ఈమె తన పాత్ర గురించి వెల్లడించారు. రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…