కరోనా మహమ్మారి సంక్షోభంతో అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆయా కంపెనీల షేర్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అనేక మంది పారిశ్రామిక దిగ్గజాల ఆదాయం ఆవిరైపోతుంది. మరో పక్క లాక్ డౌన్ కారణంగా కస్టమర్లు రాక, కొనుగోళ్లు లేక అనేక బడా షాపింగ్ మాల్స్ కూడా వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో ఆయా వ్యాపార సంస్థల యాజమాన్యాలు డీలా పడిపోతున్నారు. కానీ ఎవెన్యూ సూపర్ మార్కెట్ల అధినేత రాధాకిషన్ ధమాని ఆదాయం మాత్రం అమాంతం పెరిగిపోయింది. అత్యంత సంపన్నులైన భారతీయులలో ఈయన ఒకడయ్యాడు. కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థలు కకావికలమవుతున్నప్పటికీ రాధాకిషన్ సంపద విలువ మాత్రం ఈ ఏడాది 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక ఆయన సంపదలో సింహ భాగం అయిన అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్ల విలువ ఈ ఏడాది 18% పెరిగిందని బ్లూంబర్గ్ సంస్థ తెలిపింది.
ఒకప్పుడు ముంబైలో చిన్న గదిలో ఉంటూ వచ్చిన రాధాకృష్ణ ఇప్పుడు బిలినియర్ అయ్యారంటే దానికి కారణం అయన సూపర్ మార్కెట్ల చైన్ మాత్రమే.. లక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల కోసం చాలా మంది ప్రజలు ఈ మార్కెట్లపై పడ్డారు. ధరలు పెరిగినా పట్టించుకోకుండా కస్టమర్లంతా ఒక్కసారిగా వీటిమీద ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు కొనేశారు.
గత ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీ తరువాత ధమాని రాధాకృష్ణ రెండో బిలినియర్ గా నిలిచారు. అయితే కరోనాపై పోరాటంకోసం పీఎం కెర్ ఫండ్స్ కు ధమాని 100 కోట్లు విరాళం ప్రకటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…