Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే… ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. అయితే అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారని త్వరలో రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటారని వైద్యులు ప్రకటించారు..
అదలావుంటే రిషబ్ పంత్ కారు ప్రమాదం జరిగిన సమయంలో కారు వద్దకి వచ్చిన కొందరు జనాలు కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రిషబ్ పంత్ ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, బ్రాస్లైట్ వంటి ఖరీదైన వస్తువులు కూడా కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ పంత్ కోలుకుని నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పంత్ అభిమానులు, నెటిజన్లు మానవత్వం లేదంటూ.. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…