Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే… ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. అయితే అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారని త్వరలో రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటారని వైద్యులు ప్రకటించారు..
అదలావుంటే రిషబ్ పంత్ కారు ప్రమాదం జరిగిన సమయంలో కారు వద్దకి వచ్చిన కొందరు జనాలు కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రిషబ్ పంత్ ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, బ్రాస్లైట్ వంటి ఖరీదైన వస్తువులు కూడా కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ పంత్ కోలుకుని నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పంత్ అభిమానులు, నెటిజన్లు మానవత్వం లేదంటూ.. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…