వెండి తెరపై కొందరి హీరో హీరోయిన్ల కాంబినేషన్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. వారి కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు.అదేవిధంగా బుల్లితెరపై కూడా కొన్ని జంటలు ఎవర్ గ్రీన్ అన్నట్టుగానే ఉంటాయి.ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సందడి చేసే ఆ జంటలు నిజజీవితంలో కూడా ఒక్కటైతే చూడాలని ఎంతోమంది వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు.
ఈ విధంగా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జంటగా పేరు సంపాదించుకున్న వారిలో రష్మి -సుదీర్ ఒకరు. ఈ కార్యక్రమంలోనైనా రష్మి సుదీర్ ఉన్నారంటే ఆ కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుంది. అంతగా ఈ జంటకు పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నిర్వాహకులు వీరితో పలు ఈవెంట్స్, స్పెషల్ షో లు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఈ జంట గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు వీరికి పలు కార్యక్రమాలలో ఉత్తిత్త పెళ్లిళ్లు చేసి షో రేటింగ్స్ పెంచుకుంటారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండుగ సందర్భంగా ఈటీవీలో నిర్వహిస్తున్న టువంటి “ఊరిలోవినాయకుడు” కార్యక్రమంలో కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు నిర్వాహకులు.
ఈ క్రమంలోనే తొమ్మిది సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడి వారి ప్రేమకు ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్, రష్మి వారు తొమ్మిది సంవత్సరాల ప్రేమకు గుర్తుగా చేసినటువంటి లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.
గత తొమ్మిది సంవత్సరాల నుంచి వీరి మధ్య జరిగినటువంటి కొన్ని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ పాటల రూపంలో రష్మి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక ఈ పాటలను చూసిన రోజా తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేసినందుకు రష్మీ ఎంతో అందంగా ప్రపోజ్ చేసింది. మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరి కోరిక అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేయగా ఒక్కసారిగా రష్మి సుదీర్ కౌగిలించుకొని ఎంతో బావోద్వేగానికి గురయ్యారు. అంతలో ఇంద్రజ మాట్లాడుతూ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓకే ఎస్ అనే ఫైనల్ వరల్డ్ కావాలి మాకు అంటూ ఈ కార్యక్రమం పై ఆసక్తని పెంచారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…