స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్కి పరిచయమైన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన గత పాన్ ఇండియన్ సిరీస్ బాహుబలి వరకు అపజయం అంటే ఏంటో తెలియని దర్శకుడు. ఒక్కో సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంటూ బాహుబలి రెండు భాగాలతో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ దర్శకుడుగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజమౌళి గురువుకు తగ్గ శిష్యుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు.
ఇంకా చెప్పాలంటే ఆయన కంటే కాస్త ఎక్కువ పేరునే సాధించారు. హీరో ఎవరైనా సినిమా మీద రాజమౌళి ముద్ర పడాల్సిందే. ఒక సీన్ కోసం రోజులకి రోజులు చిత్రీకరణ జరుపుతాడనే విషయంలో కొంత నెగిటివ్ కామెంట్స్ వినిపించిన ఫైనల్ గా అవుట్ పుట్ చూసిన వారు నోటికి తాళాలు వేసుకోవాల్సిందే. జూనియర్ ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్, సునీల్, రవితేజ, రానాలకు తన సినిమాలతో దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ భారీ స్థాయిలో క్రేజ్ తీసుకువచ్చాడు.
ఇక రాజమౌళి సినిమాల విషయంలో కథ ఏంటో ముందే చెప్పేయడం అలవాటు. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కథ ఏంటి అనేది చెప్పరు. కానీ రాజమౌళి కథ ముందే లీక్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేస్తాడు. సినిమా చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు వినూత్నంగా ప్రమోషన్ నిర్వహిస్తూ భారీ స్థాయిలో అంచనాలు కలిగేలా చేస్తాడు. ముఖ్యంగా బాహుబలి సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేశారో అందరికీ తెలిసిందే. అప్పుడు ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా రాజమౌళి చేసినట్టు సినిమా ప్రమోషన్స్ ఇంకెవరూ చేయలేరని చెప్పుకున్నారు.
ఇక ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా తెరకెక్కుతున్న ఫిక్షనల్ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్. గోండు బెబ్బులి కొమురం భీంగా ఎన్.టి.ఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారమరాజుగా చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఏ పోస్టర్ గురించి గానీ, టీజర్ గురించి గానీ నెగిటివ్ టాక్ వినిపించలేదు. సినిమా మీద అంచనాలు భారీగానూ పెంచాయి.
కానీ తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి దోస్తీ అనే ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఐడియా తన కొడుకు ఎస్.ఎస్.కార్తికేయట. తాజాగా ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను పాడిన అమిత్ త్రివేది, అనిరుద్, విజయ్ యేసుదాసు, తెలుగులో హేమచంద్ర, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కనిపించారు. చివర్లో తారక్, చరణ్ మెరిశారు. విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అలాగే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. థమన్ ని కాపీ కొట్టారన్న టాక్ తో పాటు.. ఇక్కడ సినిమా ప్రమోషన్ కంటే వారి వారిని హైలెట్ చేసుకునేట్టుగా ఉందని.. మాట్లాడుకుంటున్నారు. కాస్త లోతుగా పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తుందంటున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…