ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న జక్కన్న దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఐదు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. మరో ఐదు బాషల్లో డబ్ అయి మొత్తం 10 భాషల్లో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీం సభ్యలు తేదీని ప్రకటించారు. అదే డిసెంబర్ 19న హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు. అయితే ఇప్పటికే మన తెలుగు హీరోలు ముంబయ్ లో వాలిపోయారు.
వాళ్లు అక్కడ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తాడనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం తన తాజా యాక్షన్ చిత్రం యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విజయంతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఇటీవలి కాలంలో తారా సుతారియా , అహన్ శెట్టి నటించిన రొమాంటిక్ డ్రామా తడప్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్తో పాటు.. పలువురు ఇతర అగ్ర నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.
అయితే.. దీని గురించి అధికారికంగా ధృవీకరణ ఇంకా కాలేదు. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తెలుగులో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఉంటదనే దానిపై ఎలాంటి అధికారింగా ప్రకటన రాలేదు. మరోవైపు.. SS రాజమౌళి త్వరలో రాబోయే హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు సంబంధించి నిన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో రాజమౌళి, నాగార్జున పాల్గొని తమ ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, నాగార్జునతో పాటు రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్ , దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరు అయ్యారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…