ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న జక్కన్న దర్శకత్వంలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. ఐదు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. మరో ఐదు బాషల్లో డబ్ అయి మొత్తం 10 భాషల్లో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
అయితే పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ టీం సభ్యలు తేదీని ప్రకటించారు. అదే డిసెంబర్ 19న హిందీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు. అయితే ఇప్పటికే మన తెలుగు హీరోలు ముంబయ్ లో వాలిపోయారు.
వాళ్లు అక్కడ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వస్తాడనేది సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం తన తాజా యాక్షన్ చిత్రం యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విజయంతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఇటీవలి కాలంలో తారా సుతారియా , అహన్ శెట్టి నటించిన రొమాంటిక్ డ్రామా తడప్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్తో పాటు.. పలువురు ఇతర అగ్ర నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.
అయితే.. దీని గురించి అధికారికంగా ధృవీకరణ ఇంకా కాలేదు. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. ఇక తెలుగులో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఉంటదనే దానిపై ఎలాంటి అధికారింగా ప్రకటన రాలేదు. మరోవైపు.. SS రాజమౌళి త్వరలో రాబోయే హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు సంబంధించి నిన్న విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో రాజమౌళి, నాగార్జున పాల్గొని తమ ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, నాగార్జునతో పాటు రణబీర్ కపూర్, కరణ్ జోహార్, అలియా భట్ , దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరు అయ్యారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…