Sai Dharam Tej: మెగా అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యే తీవ్ర గాయాలు పాలైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల 21వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాదులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక నిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తిరిగి ఈ వేదికపై నిలబడ్డాను అంటే అది కేవలం మీ ఆశీర్వాదం మీ ప్రేమ ప్రార్థనల వల్లే అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.
ఇక విరూపాక్ష సినిమా గురించి మాట్లాడుతూ సుకుమార్ గారు 2019వ సంవత్సరంలోనే ఈ సినిమా కథ వినాలని చెప్పారు. ఇది ఒక ప్రేమ కథ అయ్యుంటుంది అనుకున్నాను కానీ కార్తీక్ వచ్చి ఇది క్రైమ్ త్రిల్లర్ అని చెప్పగానే షాక్ అయ్యానని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కథ విన్న తర్వాత ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అవుతుందని భావించి ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన తెలియజేశారు. ప్రస్తుతం సాయి తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికర సంఘటనలు కాలానుగుణంగా మళ్లీ వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి ఓ అరుదైన విషయం తాజాగా…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…