Sai Dharam Tej: మెగా అల్లుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యే తీవ్ర గాయాలు పాలైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా ఈనెల 21వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాదులో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శక నిర్మాతలతో పాటు ఇతర చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తిరిగి ఈ వేదికపై నిలబడ్డాను అంటే అది కేవలం మీ ఆశీర్వాదం మీ ప్రేమ ప్రార్థనల వల్లే అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.
ఇక విరూపాక్ష సినిమా గురించి మాట్లాడుతూ సుకుమార్ గారు 2019వ సంవత్సరంలోనే ఈ సినిమా కథ వినాలని చెప్పారు. ఇది ఒక ప్రేమ కథ అయ్యుంటుంది అనుకున్నాను కానీ కార్తీక్ వచ్చి ఇది క్రైమ్ త్రిల్లర్ అని చెప్పగానే షాక్ అయ్యానని సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కథ విన్న తర్వాత ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అవుతుందని భావించి ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన తెలియజేశారు. ప్రస్తుతం సాయి తేజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…