Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండిపోయారు.
ఇలా పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్టులు కారణంగా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. ఇలా నేటిజన్స్ తనని ట్రోల్ చేసినప్పటికీ ఈమె ఘాటుగా స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంది.
ఈ క్రమంలోనే లైగర్ సినిమా విడుదల సమయంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసినటువంటి పోస్ట్ పై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ భారీగా ట్రోల్ చేశారు. అప్పట్లో ఈ వివాదం సంచలనంగా మారింది. ఈ విషయంపై అనసూయ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా మరోసారి ఆంటీ వివాదం పై అనసూయ స్పందించారు.అభిమానులతో సరదాగా ముచ్చటించిన అనసూయకు ఒక అభిమాని నుంచి ప్రశ్న ఎదురయింది. ఎందుకు అక్క మీకు ఆంటీ అంటే అంత కోపం అంటూ అనసూయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ… తనకు ఆంటీ అనే పదం అసలు నచ్చదని తెలిపారు. ఎందుకంటే ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుందని ఈమె తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు కోపం రావడం లేదని ఎందుకంటే ట్రోలర్స్ ను చక్కదిద్దే అంత సమయం తనుకు లేదని అంతకన్నా ముఖ్యమైన పనులు తనకు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అనసూయ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని సాధారణంగా భావిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో, డీహైడ్రేషన్ తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అయితే…
వేసవి కాలం వచ్చేసరికి పెద్దలకే కాదు, చిన్నారులకు కూడా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా శిశువులు, టాడ్లర్స్ సున్నితమైన చర్మం…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే ప్రమాదం కూడా అధికమవుతుంది. ముఖ్యంగా ఫ్రిజ్లో ఉంచినప్పటికీ…
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు నిద్రపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా హార్మోన్ల…
వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…
హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…