Anasuya:బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉండిపోయారు.
ఇలా పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్టులు కారణంగా నేటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. ఇలా నేటిజన్స్ తనని ట్రోల్ చేసినప్పటికీ ఈమె ఘాటుగా స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంది.
ఈ క్రమంలోనే లైగర్ సినిమా విడుదల సమయంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసినటువంటి పోస్ట్ పై విజయ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ భారీగా ట్రోల్ చేశారు. అప్పట్లో ఈ వివాదం సంచలనంగా మారింది. ఈ విషయంపై అనసూయ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా మరోసారి ఆంటీ వివాదం పై అనసూయ స్పందించారు.అభిమానులతో సరదాగా ముచ్చటించిన అనసూయకు ఒక అభిమాని నుంచి ప్రశ్న ఎదురయింది. ఎందుకు అక్క మీకు ఆంటీ అంటే అంత కోపం అంటూ అనసూయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ… తనకు ఆంటీ అనే పదం అసలు నచ్చదని తెలిపారు. ఎందుకంటే ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుందని ఈమె తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు కోపం రావడం లేదని ఎందుకంటే ట్రోలర్స్ ను చక్కదిద్దే అంత సమయం తనుకు లేదని అంతకన్నా ముఖ్యమైన పనులు తనకు ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా అనసూయ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…