Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కాశ్మీర్ పండిట్ల హత్య, గో హత్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా సాయి పల్ల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.ఈ క్రమంలోనే సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు ఏకంగా ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.
విరాటపర్వం సినిమా విడుదల తర్వాత ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి తాను ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలని మాట్లాడటం లేదు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని, మనలో మంచితనం ఉండాలి కానీ మతాలలో కాదని, మనలోనే మంచితనం లేనప్పుడు మతాలలో ఎక్కడుంటుంది అంటూ సాయి పల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఒక డాక్టర్ గా తనకు అన్ని ప్రాణులు సమానమేనని ఈమె క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే తాజాగా మరోసారి సాయి పల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నేను చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు రాజకీయంగా వాడుకుని పెద్ద ఎత్తున వివాదం సృష్టించారని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో తాను ఎవరికి భయపడటం లేదని, తాను ఎప్పటికీ ఒకటే మాట పై కట్టుబడి ఉన్నానని, నిజా నిజాలు ఏంటో అందరికీ తెలుసు అంటూ సాయి పల్లవి మరోసారి ఈ విషయంపై స్పందించారు.
ఇకపోతే సాయి పల్లవి తాజాగా నటించిన గార్గి అనే సినిమా ఈనెల 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మరోసారి ఈ వివాదం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…